YS Jagan: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇవాళే బ్యాంకు అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ.. వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ..

|

Feb 28, 2023 | 7:30 AM

నాలుగో సంవత్సరం, మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసాలో భాగంగా.. ఇటీవల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో.. బహిరంగ వేదిక ఏర్పాటు చేశారు.

YS Jagan: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇవాళే బ్యాంకు అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ.. వారికి ఇన్‌పుట్‌ సబ్సిడీ..
AP Cm Ys Jagan Mohan Reddy
Follow us on

ఏపీ సీఎం జగన్ గుంటూరు జిల్లా, తెనాలి పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాలుగో సంవత్సరం, మూడో విడత వైయస్ఆర్ రైతు భరోసాలో భాగంగా.. ఇటీవల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో.. బహిరంగ వేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడకి కిలోమీటర్ దూరంలోని కవిరాజనగర్లో హెలి ప్యాడ్ రూపొందించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, తదితర అధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు పెద్ద ఎత్తున సభా స్థలికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. నియోజకవర్గం నుంచి రైతాంగం హాజరయ్యేలా చూస్తున్నారు పార్టీ లీడర్లు. మూడో విడతగా ఒక్కొక్కరికి 2 వేల చొప్పున 51.12 లక్షల రైతుల ఖాతాల్లో 1090.76 కోట్ల నిధులు జమ చేయనున్నారు. మూడున్నరేళ్లలో ఈ పధకం కింద 27 వేల 062.09 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. గత డిసెంబర్‌లో మాండోస్‌ తుఫాన్‌ వల్ల నష్టపోయిన 91,237 మంది రైతులకు 6.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సైతం సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తెనాలికి వస్తున్న ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు రైతులు. ఈరోజు ఉదయం బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేస్తారు.
ఇక షెడ్యూల్ ఎలా ఉందని చూస్తే.. ఉదయం 9 గంటల 50 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుండి హేలిపాడ్ కు చేరుకుంటారు సీఎం జగన్. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో 10 గంటలకు బయలుదేరి పదింబావుకల్లా కవిరాజనగర్ చేరుకుంటారు. తెనాలి ప్రజా ప్రతినిధులతో మాట్లాడి.. అక్కడి నుంచి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆపై బహిరంగ సభకు పదీ ముప్పైఐదుకు రీచ్ అవుతారు.

ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ సందర్శించి లబ్ధిదారులతో ఫోటోలు దిగుతారు. పదిముప్పావు నుంచి పన్నెండుంబావు మధ్య రైతులకు నాలుగో సంవత్సరం, మూడో విడత వైయస్సార్ రైతు భరోసా సీఎం కిసాన్ ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేస్తారు. 12గంటల 20 నిమిషాలకు హెలిపాడ్ కి చేరుకుని బయలుదేరి వెళతారు. అక్కడ పదిహేను నిమిషాల పాటు స్థానిక నేతలతో ముచ్చటించి పన్నెండుముప్పావుకు హెలికాప్టర్లో తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..