AP 10th Class Results 2022: నేడే ఏపీ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు నేడు జూన్‌ 6, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స విడుదల చేయనున్నారు.

AP 10th Class Results 2022: నేడే ఏపీ పదో తరగతి ఫలితాలు.. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల..
Ap 10th Class Results
Follow us

|

Updated on: Jun 06, 2022 | 6:30 AM

AP SSC Result 2022 Date and Time: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల (ఏప్రిల్‌) – 2022 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త తెలిపింది. నేడు (జూన్‌ 6, సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. విజయవాడలోని ఎమ్‌జీ రోడ్‌‌లో ఉన్న గేట్‌వే హోటల్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది.

తొలుత పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్‌ 4న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, సాంకేతిక లోపంతో నేటికి వాయిదా వేసింది. ఈ పరీక్షలకు 6,21,799 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏపీతో సహా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలన్నింటినీ యథాతథంగా నిర్వహించి, ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.