AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: స‌చివాల‌యానికి అందరూ రావల్సిందే.. ఉన్నతాధికారుల‌కు రాష్ట్ర ప్రభుత్వం కీల‌క ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా కార‌ణంగా స‌చివాల‌యానికి రాని ఉన్నతాధికారులు అందరూ విధిగా కార్యాలయానికి రావాలని సూచించింది.

Andhra Pradesh: స‌చివాల‌యానికి అందరూ రావల్సిందే.. ఉన్నతాధికారుల‌కు రాష్ట్ర ప్రభుత్వం కీల‌క ఆదేశాలు
Ap Cs
Balaraju Goud
|

Updated on: Feb 18, 2022 | 3:36 PM

Share

AP Secretariat Higher Officers: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం సచివాలయ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా కార‌ణంగా స‌చివాల‌యానికి రాని ఉన్నతాధికారులు అందరూ విధిగా కార్యాలయానికి రావాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో క‌రోనా మహమ్మారి(Coronavirus) త‌గ్గుముఖం ప‌ట్టడంతో ఉన్నతాధికారుల‌కు ప్రధాన కార్యదర్శి కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సచివాలయం పరిథిలో కోవిడ్ 19 సంబంధిత పరిమితులను ఎత్తివేసిన‌ట్లు ప్రక‌టించింది రాష్ట్ర ప్రభుత్వం. వివిధ శాఖ‌ల‌ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శుల‌, ముఖ్య కార్యద‌ర్శులు, కార్యదర్శులంతా సచివాలయం నుంచి విధులకు హాజరు కావాల్సిందిగా సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఆదేశాలు జారీ చేశారు

కోవిడ్ 19 నిబంధనలు ఎత్తివేసినందున తప్పనిసరిగా సచివాలయంలోని ఆయా శాఖల కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాల్సిందిగా ఉన్నతాధికారుల‌కు సీఎస్ సూచించారు. ప్రజలకు ఇంతకాలం జరిగిన అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఉన్నతాధికారులు కూడా బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ ద్వారా హాజరు నమోదు చేయాల‌ని సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని సమావేశాలకు ఉన్నతాధికారు విధిగా హాజరు కావాలన్నారు..

ఇదిలావుంటే, సచివాలయంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విజయవాడ లోని వివిధ హెచ్ఓడీ కార్యాలయాల నుండి విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను సడలించింది. ఒక్కసారిగా ఊహించని విధంగా కేసులు పెరిగిపోవటంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక పక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా శరవేగంగా చేసింది.

Read Also….  AP Cabinet: ఉగాదికి కొత్త జిల్లాలతో పాటు కొలువుదీరనున్న కొత్తమంతివర్గం.. గంపెడు ఆశలతో నేతలు..!