Andhra Pradesh OTS Scheme: ఇళ్ల నిర్మాణాలపై గేర్ మార్చుతున్న సీఎం జగన్.. అధికారులకు ఎలాంటి దిశానిర్దేశం చేశారంటే..!
Andhra Pradesh OTS Scheme: పేదలపై వెయ్యి కోట్ల భారం తొలగించడమే లక్ష్యమంటున్న సీఎంజగన్.. ఆ దిశగా ఇళ్ల నిర్మాణాలపై గేరు మార్చుతున్నారు.
Andhra Pradesh OTS Scheme: పేదలపై వెయ్యి కోట్ల భారం తొలగించడమే లక్ష్యమంటున్న సీఎంజగన్.. ఆ దిశగా ఇళ్ల నిర్మాణాలపై గేరు మార్చుతున్నారు. ఈ క్రమంలోనే గృహ నిర్మాణం, ఓటీఎస్ పథకాలపై తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్. ఈ సమీక్షంలో పథకం పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఓటీఎస్ పూర్తి స్వచ్ఛందం అని మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్.. ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాల సమస్యలు సృష్టించే ప్రయత్నంచేస్తున్నారటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీఎస్ తో ప్రజలకు ఏరకంగా మంచి జరుగుతుందో చెప్పి, వారికి అవగాహన కలిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రుణాలు మాఫీ చేసి, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేయిస్తున్నామని చెప్పారు. దీని వలన పేదలపై దాదాపు 10వేల కోట్ల రూపాయల భారాన్ని తొలగిస్తున్నట్లు తెలిపారు. వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలను కూడా గత ప్రభుత్వం పరిశీలించలేదని విమర్శించారు సీఎం జగన్. సుమారు 43 వేల మంది టీడీపీ హయాంలో అసలు, వడ్డీ కూడా కట్టారని చెప్పారు. మరి ఇవాళ ఉచితంగా పట్టాలు ఇస్తామంటున్న వాళ్లు అప్పుడు ఎందుకు కట్టించుకున్నారని సీఎం జగన్ ప్రశ్నించారు. ఓటీఎస్ ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నామని, అవసరాలకు తనఖా పెట్టుకోవడం, అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామన్నారు. దీన్ని వాడుకోవాలా లేదా అన్నది ప్రజల ఇష్టమని స్పష్టం చేశారు. అటు గృహ నిర్మాణంపై వివరాలను ముఖ్యమంత్రికి అందించారు అధికారులు. గృహ నిర్మాణంపై ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయన్నారు సీఎం. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయని, వర్షాలు ఆగిపోయాయని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో గేర్ మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. నాణ్యతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు జగన్.
Also read: