Andhra Cabinet: ఆంధ్రా కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని అమరావతే అని రాష్ట్ర కేబినెట్ పునరుద్ఘాటించింది. ఆ మేరకు గురువారం కేబినెట్ ఒక తీర్మానాన్ని చేసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగియడంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ చట్ట సవరణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన గురువారం సచివాలయంలో జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడించారు.
ఉగ్రవాదంపై ప్రధానమంత్రికి మద్దతు:
ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలో కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్కు మంత్రి మండలి సంఘీభావాన్ని ప్రకటించింది. సిందూర్ అనే పేరుతో అందరి సెంటిమెంట్ను టచ్ చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అమృత్-2.0 పరిష్కారం:
రాష్ట్రంలోని పురపాలక సంస్థల్లో 281 పనులు కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (CHAM) కింద చేపట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
జలహారతి కార్పొరేషన్:
జలవనరుల శాఖలో “జలహారతి కార్పొరేషన్” పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణయాలు:
కర్నూలు జిల్లా బి. తండ్రపాడు గ్రామంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కు LNG HUB స్థాపనకు భూమి కేటాయింపుకు ఆమోదం. నెల్లూరు జిల్లాలో ఎకరాకు రూ.20 లక్షల పరిహారంతో భూ సేకరణ నిర్ణయం.
TTDలో మార్పులు:
టీటీడీ ఐటి విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటి)ని జనరల్ మేనేజర్ (ఐటి)గా అప్గ్రేడ్ చేసేందుకు ఆమోదం.
పర్యాటక రంగ ప్రోత్సాహం:
పర్యాటక రంగంలో ఉపాధి కల్పన ప్రోత్సాహక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..