AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: తెల్లారేసరికి ఇంటి బయట కనిపించిన పెద్ద గుంత.. అందులో ఏముందని చూడగా

తెల్లారేసరికి ఇంటి బయటకు వచ్చిన ఓ వ్యక్తీకి.. ఎదురుగా పెద్ద గుంత కనిపించింది. ఆ ప్రాంతంలో ఏదో భూమి కృంగినట్టుగా ఉంది. అయితే ఆ గుంత లోపల ఏదో ఉందని అనుమానమొచ్చిన గ్రామస్తులకు వెళ్లి చూడగా.. ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది.

AP News: తెల్లారేసరికి ఇంటి బయట కనిపించిన పెద్ద గుంత.. అందులో ఏముందని చూడగా
Ap News
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 28, 2025 | 1:11 PM

Share

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం పేరుసోముల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది. గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటి ముందు గండి ఏర్పడింది. ఏంటా అని స్థానికులు పరిశీలించగా.. ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలివస్తున్నారు.

ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా

ఈ పురాతన శివాలయం రాజుల కాలం నాటిది. ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవాళ్లు లేకుండా చేశారు. ఆ శివాలయం భూమి కింద ఉన్నది. బెస్త మద్దిలేటి అనే అతను శివాలయం ఉందని తెలియక ఇల్లు కట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం శివాలయం ఉందని తెలిసింది. తెలిసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేశారు. ఇప్పుడు ఆ శివునికి పూజలు చేయటం కోసం పేరు సోమల గ్రామస్తుల సమక్షంలో బెస్త మద్దిలేటి శివాలయానికి పూడికతీత తీసి దారి ఏర్పాటు చేశారు. శివాలయం గుడికి ప్రక్కనే పెద్ద కోనేరు ఉన్న ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. దీంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి పూజలు చేయడం మొదలు పెట్టారు. తెలుగు సంవత్సర ఉగాది రానున్న సందర్భంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా