ఏపీ శాసనమండలి విప్ కాన్వాయ్‌ బోల్తా.. ముగ్గురికి గాయాలు

వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం ఆళ్లగడ్డ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజుగా గుర్తించారు. అయితే అప్పటికే గంగుల వాహనం ముందుకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వాహనం టైర్ పేలడంతో ఈ ఘటన […]

ఏపీ శాసనమండలి విప్ కాన్వాయ్‌ బోల్తా.. ముగ్గురికి గాయాలు
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 11:11 AM

వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం ఆళ్లగడ్డ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజుగా గుర్తించారు. అయితే అప్పటికే గంగుల వాహనం ముందుకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వాహనం టైర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా సమాచారం తెలుసుకొన్న ప్రభాకర్ రెడ్డి తనయుడు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు.