AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధాని రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు!

ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అమరావతిలో సెక్షన్ 144ను అమలు చేశారు. అయినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. పోలీసులతో వాగ్వాదం, పంచాయతీ ఆఫీసులకు నల్లరంగు వెయ్యటం, నీటి సరఫరా నిలిపివేయటం, వెలగపూడి సచివాలయం బారికేడ్లను దూకేందుకు ప్రయత్నించడం వంటివి చేయడంతో పలువురి రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్రటేరియట్, చుట్టు పక్కల గ్రామాలకు నీటి సరఫరా జరగకుండా ఆపేనందుకు […]

రాజధాని రైతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు!
Ravi Kiran
|

Updated on: Dec 22, 2019 | 11:25 AM

Share

ఏపీకి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అమరావతిలో సెక్షన్ 144ను అమలు చేశారు. అయినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. పోలీసులతో వాగ్వాదం, పంచాయతీ ఆఫీసులకు నల్లరంగు వెయ్యటం, నీటి సరఫరా నిలిపివేయటం, వెలగపూడి సచివాలయం బారికేడ్లను దూకేందుకు ప్రయత్నించడం వంటివి చేయడంతో పలువురి రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

సెక్రటేరియట్, చుట్టు పక్కల గ్రామాలకు నీటి సరఫరా జరగకుండా ఆపేనందుకు గానూ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు.. మల్కాపురం, రాయపూడి, తుళ్ళూరు, వెలగపూడి గ్రామ పంచాయితీ ఆఫీస్‌లలో నల్ల రంగు వేసినందుకు గానూ రాజధాని ప్రాంతంలోని పలువురి రైతులపై మూడు కేసులు నమోదయ్యాయి.

కాగా, వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మార్చడంపై వెలగపూడి, తుళ్లూరు, మందడం, ఉద్దండరాయునిపాలెంలో రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని తరలింపును విరమించుకునే వరకు పోరాటం ఆపేదిలేదంటూ వారు హెచ్చరిస్తున్నారు.