AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇళ్ల పట్టాల పంపిణీ దురుద్దేశపూర్వకంగా నిలిపివేశారు: సీఎం జగన్‌

తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్‌ ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్‌పై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే...

ఇళ్ల పట్టాల పంపిణీ దురుద్దేశపూర్వకంగా నిలిపివేశారు: సీఎం జగన్‌
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2020 | 6:25 PM

Share

రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ దురుద్దేశపూర్వకంగా నిలిపివేయించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్‌ ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్‌పై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సంతోషించాల్సింది పోయి.. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాటిని ఆపేయాలని శనివారం ఎన్నికల కమిషనర్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారని గుర్తుచేశారు. అలాంటి కమిషనర్‌ మరుసటి రోజే ఎన్నికలు వాయిదా వేశారని.. ఆయనకు నిన్నటికి, ఈరోజుకి తేడా ఏం కనిపించిందని ప్రశ్నించారు.  ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చదివి వినిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సీఎస్‌, హెల్త్‌ సెక్రటరీని కూడా అడగకుండా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో సెక్రటరీని అడగాలి కదా? అని పేర్కొన్నారు. పది రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలను 6 వారాలు వాయిదా వేశారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేశారన్నారు. తనను గెలిపించలేదనే అక్కసుతో చంద్రబాబు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు.