AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంటల బీమా సొమ్ము విడుదల..ఇవీ మార్గదర్శకాలు

రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించేందుకు సర్కారు రూ. 596.36 కోట్లు విడుదల చేసింది. ఈ బీమా ప్రీమియం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. దీనిద్వారా 5.94 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది. ఇక 2019-20 నుంచి రైతులందరికీ ఉచితంగా..

పంటల బీమా సొమ్ము విడుదల..ఇవీ మార్గదర్శకాలు
Jyothi Gadda
|

Updated on: Jun 26, 2020 | 2:43 PM

Share

రబీ పంటల బీమా సొమ్మును రైతులకు చెల్లించేందుకు సర్కారు రూ. 596.36 కోట్లు విడుదల చేసింది. ఈ బీమా ప్రీమియం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. దీనిద్వారా 5.94 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది. ఇక 2019-20 నుంచి రైతులందరికీ ఉచితంగా వైఎస్సార్ పంటల బీమా అమలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రైతు ఒక్క రూపాయి కడితే చాలు భరోసా కేంద్రంలోనే ఇ-క్రాపింగ్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తామని మరోమారు సీఎం స్పష్టం చేశారు.

బీమా పరిహారం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని సీఎం జగన్ అన్నారు. రైతులు కట్టాల్సిన ప్రీమియం వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా.. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్‌ కలిసి ఇ– క్రాపింగ్‌ రిజిస్టర్‌ చేసి.. వెంటనే ఇన్సూరెన్స్‌ను కట్టేలా ఏర్పాటు చేస్తారన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం కడుతుందని.. బీమా పరిహారం పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

Follow Us