జగన్ బాటలో చినబాబు..?
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ కూడా బృహత్తర కార్యక్రమం చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్.. సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజల సమస్యలు తెలుసుకుని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపేందుకు, తన ఇమేజ్ను సైతం పెంచుకునేందుకు గానూ నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే […]
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ కూడా బృహత్తర కార్యక్రమం చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్.. సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజల సమస్యలు తెలుసుకుని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపేందుకు, తన ఇమేజ్ను సైతం పెంచుకునేందుకు గానూ నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే సుదీర్ఘ పాదయాత్ర కాకుండా విడతల వారీగా యాత్ర చేయాలనీ చినబాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.