ఓపెన్ మార్కెట్ ద్వారా రుణం.. ఏపీకి కేంద్ర అనుమతి
ఓపెన్ మార్కెట్ రూ.20వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీంతో ఈ నెల 25న రూ.2వేల కోట్ల రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అప్పులను ఉత్పాదక, సంక్షేమ రంగాలకు ఖర్చు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ఆర్బాటాలు, హంగుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయొద్దని, ప్రతి పైసాను పొదుపుగా […]
ఓపెన్ మార్కెట్ రూ.20వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. దీంతో ఈ నెల 25న రూ.2వేల కోట్ల రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అప్పులను ఉత్పాదక, సంక్షేమ రంగాలకు ఖర్చు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ఆర్బాటాలు, హంగుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయొద్దని, ప్రతి పైసాను పొదుపుగా వాడాలని, తెచ్చిన అప్పులను ఉత్పాదక రంగాలకు, పేదల సంక్షేమానికే ఖర్చు చేయాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు.
అయితే ఓపెన్ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం ద్వారా ప్రతినెలా అవసరానికి అనుగుణంగా కొంతమేర రుణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ సమీకరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ మార్కెట్ నుంచి రూ.32,000 కోట్ల రుణం పొందడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గత టీడీపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తొలి త్రైమాసికానికి రూ.8,104 కోట్ల రుణం చేసేందుకు మాత్రమే అనుమతించింది. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.20,863 కోట్ల రుణం కోసం తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది.