AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganja: ఏపీలో గుప్పుమంటున్న మత్తు.. బానిసగా మారుతున్న యువత.. కృష్ణాజిల్లాలో

ఇటు ఏపీలోనూ గంజాయి దందా రూటు మారుతోంది. నగరాలు, పట్టణాలను దాటుకుని ఇప్పుడు గ్రామాల్లోకి విస్తరిస్తోంది. కృష్ణాజిల్లాలో బయటపడిన రెండు ఇన్సిడెంట్స్‌ ఇప్పుడు కలకలం రేపుతున్నాయ్‌.

Ganja: ఏపీలో గుప్పుమంటున్న మత్తు.. బానిసగా మారుతున్న యువత.. కృష్ణాజిల్లాలో
Ganja
Ram Naramaneni
|

Updated on: Nov 28, 2022 | 10:01 AM

Share

గంజాయ్‌ బ్యాచ్‌లు చెలరేగిపోతున్నాయ్‌. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగిపోతున్నాయ్‌. ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన గంజాయి దందా ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తోన్న ముఠాలు, చిన్నచిన్న పొట్లాలు కట్టి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గుడివాడలో పది కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు, నలుగురిని అరెస్ట్‌ చేశారు.

నలుగురు నిందితుల్లో ఇద్దరిని ఛత్తీస్‌గఢ్‌ వాసులుగా గుర్తించారు. ఈ ఇద్దరిపై పలు పోలీస్‌స్టేషన్లలో అనేక కేసులు ఉన్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలే టార్గెట్‌గా వీళ్లు గంజాయి విక్రయాలు చేస్తున్నట్టు తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఉంగుటూరు మండలం తేలప్రోలులో మరో నలుగుర్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వీళ్ల దగ్గర్నుంచి నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఈ నలుగురూ గంజాయి సేవిస్తూ పట్టుబడినట్టు వెల్లడించారు. ఈ రెండు ఇన్సిడెంట్‌తో గ్రామాల్లో అలజడి రేగింది. పల్లెల్లో కూడా గంజాయి కల్చర్‌ పెరిగిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి, గ్రామీణ ప్రాంతాలకు పాకుతోన్న గలీజు గంజాయిని పోలీసులు ఎలా కట్టడి చేస్తారో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి.