AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో అల్లాడిస్తున్న చలి.. ఏజెన్సీ ప్రాంతాల్లో గజగజ
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అల్లూరి జిల్లాలోని మన్యం ప్రాంతమంతా గజగజ వణుకుతోంది. పర్యాటకులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. అందమైన తెలుగు పల్లెలు ఈ శీతాకాలం మరింత అందాన్నిసంతరించుకున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోయి, ఊళ్ళల్లో పొగమంచు కమ్ముకుంటోంది. అల్లూరి జిల్లా…ఏజెన్సీ ప్రాంతంలో రోజు రోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అల్లూరి జిల్లాలోని మన్యం ప్రాంతమంతా గజగజ వణుకుతోంది. అటవీ ప్రాంతంలో దట్టంగా అలుముకున్న పొగ మంచు ఓ వైపు పర్యాటకులను ఆనందంలో ముంచెత్తుతోంటే… మరో వైపు ఆదివాసీ ప్రాంతాలు చలికి గజగజ వణికిపోతున్నాయి.
అల్లూరి జిల్లా…మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకు పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోవైపు గుంటూరు, నరసరావుపేటలో… పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. పాడేరు వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు వెల్లువెత్తుతున్నారు. శీతాకాలం కావడం… ఆపై మంచు దట్టంగా కురవడంతో జనం ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక మరోవైపు తెలంగాణ పల్లెల్లో …వాతావరణంలో ఉష్ణోగ్రత శాతం తగ్గిపోవడంతో చలి పులిలా గాండ్రిస్తోంది. ఇక చాలా చోట్ల ఇళ్ళముందు చలిమంటల సందడి మొదలయ్యింది. ప్రజలు చలిమంటలు కాస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి.