AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ప్రాణంగా పెంచుకున్న కుక్క మృతి.. ప్రతి ఏడాది దాన్ని జ్ఞాపకాల్లో ఇలా..

పద్నాలుగేళ్ల క్రితం డాబర్ మెన్ కుక్క పిల్లను కొని ఓ వ్యక్తి ఇంటికి తెచ్చుకున్నాడు. గత ఏడాది ఇంటి బయట వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో కుక్క ప్రాణాలు కోల్పోయింది. డిసెంబర్ 17కి ఆ కుక్క చనిపోయి ఏడాది అయిన సందర్భంగా ప్లెక్స్ కూడా వేయించి ఇంటి ముందు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Andhra News: ప్రాణంగా పెంచుకున్న కుక్క మృతి.. ప్రతి ఏడాది దాన్ని జ్ఞాపకాల్లో ఇలా..
Dog Funeral Flexi
T Nagaraju
| Edited By: |

Updated on: Dec 18, 2024 | 2:01 PM

Share

దాని పేరు జిమ్మి.. పద్నాలుగేళ్ల క్రితం ఆ ఇంటిలోకి అడుగుపెట్టింది. ఎంతో అపురూపంగా దాన్ని చూసుకున్నారు. ప్రేమానురాగాలు కురిపించే అది క్యాన్సర్ బారిన పడితే అత్యాధునిక వైద్యం కూడా చేయించారు. అయినా విధి రాత మరోలా ఉంది. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో అది చనిపోయింది. అంతే ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఏడాది గడిచిన దాని జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో వర్ధంతికి ప్లెక్స్ వేసి మరోసారి దాని పట్ల వారి అభిమానాన్ని చాటుకున్నారు.

గుంటూరు ఫాతిమా పురంకు చెందిన సీతంశెట్టి శ్రీనివాసరావు.. పద్నాలుగేళ్ల క్రితం డాబర్ మెన్ కుక్క పిల్లను కొని ఇంటికి తెచ్చుకున్నారు. అప్పటి నుండి దాన్ని అపురూపంగా పెంచుకున్నారు. దానికి జిమ్మి అని పేరు కూడా పెట్టుకున్నారు. కొన్నేళ్ల తర్వాత జిమ్మికి క్యాన్సర్ సోకింది. మంచి వైద్యం చేయించడంతో క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడింది. కాని కొద్దీ కాలానికే ఇంటి బయట వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో జిమ్మి ప్రాణాలు కోల్పోయింది. జిమ్మి లేని బాధను మర్చిపోవటానికి మరో కుక్క పిల్లను తెచ్చుకొని శ్రీనివాసరావు పెంచుకుంటున్నారు.

ఏడాది క్రితం డిసెంబర్ 17వ తేదీనే జిమ్మి ప్రాణాలు కోల్పోయింది. జిమ్మి చనిపోయి ఏడాదైనా సందర్భంగా శ్రీనివాసరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అంతేకాదు జిమ్మి గుర్తుగా ప్లెక్స్ కూడా వేయించి ఇంటి ముందు పెట్టుకున్నారు. శ్రీనివాసరావు కుటుంబం జిమ్మి పట్ల చూపించిన ప్రేమను తలుచుకొని కాలనీ వాసులు కూడా మరోసారి జిమ్మిని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?