Bapatla District: బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి.. అతడి వద్ద ఉన్న బ్యాగ్ చెక్ చేయగా..

ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. అయితే అతడి వద్ద ఉన్న బ్యాగ్‌లో రూ.కోటి కంటే ఎక్కువ విలువైన వజ్రాలు, బంగారు నగలు ఉన్నాయి.

Bapatla District: బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి.. అతడి వద్ద ఉన్న బ్యాగ్ చెక్ చేయగా..
Diamonds (Representative image)
Follow us

|

Updated on: Nov 25, 2022 | 2:54 PM

ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ట్రావెల్  చేస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు దగ్గర చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని బొబ్బా పవన్ కుమార్(41) గా గుర్తించారు. అతడి సొంతూరు చిత్తూరు జిల్లాలోని భీమవరం. ప్రస్తుతం గుంటూరులోని కిషన్ జ్యూయలరీలో పనిచేస్తున్నాడు. అతను తిరుపతి నుంచి గుంటూరు వచ్చి 3 నెలలు అవుతుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కుమార్ తిరుపతిలోని కిషన్ జ్యూయలరీ మార్కెటింగ్​ విభాగంలో సేల్స్ మ్యాన్‌గా తిరుపతిలో పని చేసేవాడు. 3 నెలల క్రితం బదిలీపై గుంటూరు వచ్చాడు. సండే మార్నింగ్  గుంటూరు నుండి వజ్రాలు పొదిగిన నెక్లెస్ తీసుకొని ఒంగోలులోని ఓ ఆభరణాల షాపునకు వెళ్లాడు. అక్కడ ఆ వస్తువులను చూపించి నైట్ సుమారు 10 గంటల సమయంలో ఒంగోలు ఆర్టీసీ డిపోకి చేరుకున్నాడు. అక్కడి నుంచి గుంటూరు వెళ్లేందుకు కనిగిరి టూ విజయవాడ వెళ్లున్న ఆర్టీసీ బస్సు ఎక్కాడు.

మార్గమధ్యంలో  కొరిశపాడు వద్ద రాత్రి 11 గంటల సమయంలో.. పవన్‌ ఛాతినొప్పి వచ్చింది. అతడు ఇబ్బంది పడటాన్ని గమనించిన పక్కనున్న వ్యక్తి.. వెంటనే డ్రైవర్‌కు విషయం చెప్పాడు. డ్రైవర్ బస్సు వెంటనే 108 కాల్ చేశాడు. 108 స్టాఫ్ వచ్చి.. అప్పటికే అతడు మరణించినట్లు నిర్ధారించారు. డ్రైవర్​ సమాచారంతో పోలీసులు స్పాట్‌కు వచ్చి.. వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి ఫోన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అతడు ఆభరణాల షాపులో పని చేస్తాడని నిర్ధారించుకున్నారు. బస్సులో మృతుడు కూర్చున్న ప్రాంతంలో చూడగా ఓ బ్యాగ్ కనిపించింది.

ఆ బ్యాగ్ ఓపెన్ చేయగా సుమారు రూ.కోటి విలువైన 47 వజ్రాలు, గోల్డ్ జ్యూయలరీ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పవన్ డెడ్‌బాడీని అద్దంకి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు.  పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సోమవారం జ్యూయలరీ కంపెనీకి చెందిన వ్యక్తులు సరైన డాక్యుమెంట్స్ తీసుకురావడంతో.. వజ్రాలు, బంగారు నగలను వారికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయడి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!