Atchutapuram Gas Leak: అచ్యుతాపురంలో విషవాయువు లీక్‌ ఘటన.. బాధితులకు కొనసాగుతున్న చికిత్స..

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని పొరస్ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటన.. కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో కార్మికులు పరుగులు పెట్టారు.

Atchutapuram Gas Leak: అచ్యుతాపురంలో విషవాయువు లీక్‌ ఘటన.. బాధితులకు కొనసాగుతున్న చికిత్స..
Atchutapuram Gas Leak
Follow us

|

Updated on: Jun 04, 2022 | 8:54 AM

Atchutapuram Gas Leak: అచ్యుతాపురం బ్రాండిక్స్ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన ఎల్జీ పాలిమర్స్ ఘటనను తలపించింది. ఎక్కడికక్కడ మహిళలు స్పృహ కోల్పోయి నిల్చున్నచోటే పడిపోతుండడం ఆందోళన కలిగించింది. మొదట నలుగురు అనుకున్నా.. ఆ తర్వాత దాదాపు 400 మంది వరకు బాధితులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని పొరస్ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటన.. కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో కార్మికులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో వందలాది మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతపురం ఎస్ఈ జడ్ విషవాయువు లీక్ ఘటనలో.. బాధితులు క్రమంగా కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని.. కొందరు ఆక్సిజన్ పై చికిత్స పొండుతున్నట్లు తెలిపారు. కాగా.. బాధితులకు నిరంతరాయంగా వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో 114, మరో రెండు ప్రయివేట్ ఆసుపత్రుల్లో 60మందికి చికిత్స అందిస్తున్నారు. దీంతోపాటు కేజీహెచ్ లో మరో 8మంది బాధితులు చేరారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

  • వివిధ ఆసుపత్రుల్లో చేరిన బాధితులు సంఖ్య – 247
  • డిశ్చార్జ్ అయిన బాధితులు 15మంది
  • ఇంకా చికిత్స పొండుతున్న వారు 232 మంది ఉన్నారు.

కాగా.. పరిస్థితి ఆందోళన కారంగా మారిన వారికి ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రతీ వార్డుకో స్పెషలిస్ట్ తో పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆసుపత్రుల్లో విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. పోరస్ లాబొరేటరీస్ లీకేజీ ఘటనపై విచారణకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, ఏఎస్పీ, పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్, అగ్నిమాపక జిల్లా అధికారితో కమిటీ నియమించింది. దీనిపై ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక అందించాలని ఆదేశించింది. కాగా.. నిపుణుల కమిటీ.. కచ్చితంగా విషవాయువు ఎక్కడ నుంచి లీకైందనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇదిలాఉంటే.. పరిస్థితిపై మంత్రులు బూడి ముత్యాలానాయుడు, అమర్ నాధ్ ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసమే టిప్స్.. ఇవి తెలుసుకుంటే ఆ సమస్యలకు..
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసమే టిప్స్.. ఇవి తెలుసుకుంటే ఆ సమస్యలకు..
పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలి!
పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలి!
ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్
యూజర్లకు షాకిచ్చిన మస్క్‌..ఇక వారు కూడా ఫీజు చెల్లించాల్సిందే..
యూజర్లకు షాకిచ్చిన మస్క్‌..ఇక వారు కూడా ఫీజు చెల్లించాల్సిందే..