AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యెమెన్‌లో మారణహోమం.. ప్రధాని లక్ష్యంగా బాంబుల దాడి.. వరుస పేలుళ్లలో 26 మంది మృతి, 50 మందికి గాయాలు..

యెమెన్‌లోని ఆదెన్ విమానాశ్రయంలో దుండగులు మారణహోమానికి తెగబడ్డారు. వరుస బాంబు దాడి తీవ్ర విషాదాన్ని నింపింది.

యెమెన్‌లో మారణహోమం.. ప్రధాని లక్ష్యంగా బాంబుల దాడి.. వరుస పేలుళ్లలో 26 మంది మృతి, 50 మందికి గాయాలు..
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 31, 2020 | 6:30 AM

Share

యెమెన్‌లోని ఆదెన్ విమానాశ్రయంలో దుండగులు మారణహోమానికి తెగబడ్డారు. వరుస బాంబు దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ దేశ ప్రధాన మంత్రి, నూతన మంత్రివర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన బాంబు దాడిలె 26 మంది ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని యెమెన్ అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడి నుంచి ప్రధాని సహా నూతన మంత్రివర్గం సురక్షితంగా బయటపడ్డారని యెమెన్ అధికారులు వెల్లడించారు.

నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ పెద్దలకు ఘనంగా స్వాగతం పలకడానికి అధికారులు, ప్రజలు ఎయిర్‌పోర్టులో పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇంతలోనే ప్రధాని మోయిన్ అబ్దుల్ మాలిక్, 10 మంది మంత్రులతో వచ్చిన ప్రత్యేక విమానం అక్కడ ల్యాండ్ అయింది. విమానం నుంచి వారు కిందికి దిగుతుండగా.. ఇంతలో భారీ శబ్దంతో బాంబు పేలింది. రన్‌వేకు సమీపంలో ఓ పక్కన పార్క్ చేసిన కారును ఒక్కసారిగా పేల్చివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రాకెట్ బాంబు దాడికి పాల్పడినట్లు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ బాంబు దాడిలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు అనంతరం కొంత మంది ప్రాణ భయంతో ప్రవేశమార్గం వైపు పరుగులు తీశారు. ఇంతలో అక్కడ మరో బాంబ్ పేల్చారు. బాంబు పేలుడుకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇరాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్న హుతి రెబెల్స్ ఈ పేలుళ్లకు పాల్పడ్డట్లు అధికారులు భావిస్తున్నారు. యెమెన్‌లో గత కొన్నెళ్లుగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 10 వేల మందికి పైగా సామాన్యులు బలయ్యారు. సుదీర్ఘ కాలంగా నెలకొన్న అస్థిరత్వానికి చెక్ పెడుతూ డిసెంబర్ 18న కొన్ని వేర్పాటువాద సంస్థలు, ప్రభుత్వం కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. పవర్ షేరింగ్ కేబినెట్‌ను ఏర్పాటు చేశాయి. ఈ పరిణామం పట్ల యెమెన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా తాజా దాడి జరిగింది.

బాంబు దాడిని ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాధినేతలు ఖండించారు. ‘ఇదొక మూర్ఖమైన చర్య’ అని యెమెన్ నూతన ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటి దాడులతో తమ ముందున్న పవిత్ర కార్యాన్ని అడ్డుకోలేరని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ