AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తల్ని చితకగొట్టి నోరు మూయించే భార్యలు ఏ దేశంలో ఎక్కువ? మన దేశంలోని భార్యలు ఎన్నో స్థానంలో ఉన్నారంటే..

గృహ హింస అంటే సర్వసాధారణంగా భార్యలను భర్త వేధిస్తుండమే అని ఎక్కువ మంది భావిస్తున్నారు. అందుకే స్త్రీ రక్షణ కోసం గృహ హింస చట్టం కూడా ఉంది. అయితే ఇటీవలి ఐక్యరాజ్యసమితి గృహ హింస గురించి ఒక షాకింగ్ నివేదికను వెల్లడించింది. ఇవి విన్నవారు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం భర్తలను కొట్టే భార్యలు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారో తెలియజేసింది. సాధారణంగా స్త్రీలను గృహ హింస బాధితులుగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు ఈ అధ్యయనం పురుషులు కూడా గృహ హింసను ఎదుర్కొంటున్నారని తెలియజేస్తుంది.

భర్తల్ని చితకగొట్టి నోరు మూయించే భార్యలు ఏ దేశంలో ఎక్కువ? మన దేశంలోని భార్యలు ఎన్నో స్థానంలో ఉన్నారంటే..
Wife Beat Her Husband
Surya Kala
|

Updated on: May 27, 2025 | 6:44 PM

Share

గృహ హింస విషయానికి వస్తే చాలా మంది మహిళలు మాత్రమే బాధితులు అని పురుషులు హింసకు పాల్పడుతున్నారని నమ్ముతారు. అయితే ఐక్యరాజ్యసమితి నుంచి ఇటీవల వచ్చిన ఒక నివేదిక ఈ ఆలోచనను సవాలు చేస్తుంది. నివేదిక ప్రకారం చాలా దేశాలలో మహిళలు కూడా గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పురుషులు, ముఖ్యంగా భర్తలు భార్య బాధితులుగా మారుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భార్యలు తమ భర్తలను కొట్టే కేసులు వేగంగా పెరుగుతున్న జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది.

ఐక్యరాజ్యసమితి నేర గణాంకాల ప్రకారం ఈజిప్టులో భర్తలు గృహ హింసను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఆ దేశ కుటుంబ కోర్టు ప్రకారం గృహ హింస బాధితులైన భర్తలలో 66 శాతం మంది విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో యునైటెడ్ కింగ్‌డమ్ రెండవ స్థానంలో ఉండగా భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారతదేశం వంటి సాంప్రదాయ సమాజంలో ఈ సంఖ్య ఖచ్చితంగా దిగ్భ్రాంతికరమైనది. అయితే మన దేశంలోని వాస్తవిక పరిస్థితి ఏమిటంటే చాలా మంది పురుషులు తమ ఇంట్లో పెడుతున్న హింసని .. భార్యలు పెడుతున్న కష్టాలను నిశ్శబ్దంగా భరిస్తున్నారు.

స్త్రీలే కాదు, పురుషులు కూడా బాధితులవుతున్నారు

గృహ హింస అంటే భర్త తన భార్యపై చేయి ఎత్తడం అని సాధారణ భావన. అయితే ఈ నివేదిక హింసకు లింగం సంబంధం లేదని.. అది ఎవరిపైనైనా, ఎవరైనా చేయవచ్చు అని తెలియజేస్తుంది. మహిళలు కొన్నిసార్లు కోపం, నియంత్రణ కోరిక లేదా ఒత్తిడి కారణంగా తమ భర్తలపై శారీరక హింసకు పాల్పడుతున్నారు. సమాజంలో ఈ విషయంపై బహిరంగ చర్చ జరగక పోవడం వల్ల ఈ అంశం చాలా కాలంగా నిర్లక్ష్యం చేయబడుతోంది.

ఇవి కూడా చదవండి

UN గుడ్‌విల్ అంబాసిడర్ ఏమి చెప్పారంటే

ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్ కూడా తన ప్రసంగంలో మనం నిజంగా లింగ సమానత్వం వైపు వెళ్లాలనుకుంటే..హింస అనేది ఒక లింగానికి సంబంధించిన సమస్య కాదని మనం అర్థం చేసుకోవాలి అని అన్నారు. మహిళా సాధికారత అంటే పురుషులను బలహీనపరచడం కాదు.. అందరికీ సమాన హక్కులు , భద్రత కల్పించడం. పురుషులపై హింసను కూడా తీవ్రంగా పరిగణించకపోతే గృహ హింసకు వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటం అసంపూర్ణంగా మిగిలిపోతుందని చెప్పారు.

ఇప్పుడు గృహ హింసపై దృక్పథాన్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ఈ నివేదిక సమాజం తీరుని తెలియజేస్తున్న ఒక అద్దం లాంటిది. పురుషులు కూడా గృహ హింస బాధితులు అవుతున్నారనే విషయాన్ని మనం అంగీకరించాలి. స్త్రీల మాదిరిగానే పురుషులకు సహాయం, కరుణ, న్యాయం అవసరం. భారతదేశం వంటి దేశంలో పురుషులు ఎల్లప్పుడూ బలంగా ఉండాలని ఆశిస్తారు. అయితే ఇప్పుడు పురుషుల బాధను వినడం , అర్థం చేసుకోవడం చాలా ముఖ్యంగా మారింది. కనుక ఇప్పుడు సమాజంలో స్త్రీ, పురుష బేధాలు అనే రెండు అంశాలను ఒకే త్రాసుపై తూకం వేయవలసిన సమయం ఆసన్నమైంది

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..