ఇక నుంచి ఆ రెండు మసీదుల్లో వారికి మాత్రమే అనుమతి.. కీలక ఆదేశాలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం..!

కరోనా మహమ్మారి వ్యాప్తి నుంచి దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మసీదులలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం..

ఇక నుంచి ఆ రెండు మసీదుల్లో వారికి మాత్రమే అనుమతి.. కీలక ఆదేశాలు జారీ చేసిన అక్కడి ప్రభుత్వం..!
Follow us

|

Updated on: Oct 10, 2021 | 10:07 AM

కరోనా మహమ్మారి వ్యాప్తి నుంచి దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మసీదులలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలన్ని సడలించారు. కానీ కానీ దేశాల్లో మసీదులు, ప్రార్థన మందిరాలలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా సౌదీ ఆరేబియాలో వ్యాక్సినేషన్‌ చేసుకున్న వారికి మాత్రమే మసీదుల్లో అనుమతి ఉంటుందని చెబుతోంది. గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలపై సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా కీలక ప్రకటన చేసింది. ఆదివారం నుంచి కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ రెండు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ దేశ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలు అక్టోబర్ 10 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న సందర్శకులు గ్రాండ్, ప్రొఫెట్ మసీదులో ఉమ్రా, ప్రార్థనలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.

యాత్రికులు ఎవరైతే ఇప్పటికే ఈ మసీదుల్లో ఉమ్రా, ప్రార్థనల కోసం రిజర్వేషన్ చేసుకుని పర్మిట్ పొందారో వారు యాత్రకు 48 గంటల ముందు రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న అనుమతి ఇస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. లేనిపక్షంలో వారి పర్మిట్ రద్దు చేస్తామని తెలిపింది. అంటువ్యాధికి సంబంధించిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు పబ్లిక్ హెల్త్ అథారిటీ నిరంతర మూల్యాంకనానికి లోబడి ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందుకే కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

ఇవీ కూడా చదవండి:

Danish PM India Tour: డానిష్ ప్రధాని పర్యటనలో పురూలియా ఆయుధాల కుంభకోణంలో నిందితుడు కిమ్ డేవిని అప్పగింతపై చర్చలు

India-China stand-off: భారత్‌ – చైనా మధ్య ప్రతిష్టంభన తొలిగేనా..? నేడు 13వ దఫా చర్చలు..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?