Mexico: తప్పిపోయిన ఏడుగురు కోసం వెదుకుతుంటే.. 45 సంచులలో ఉన్న మృత దేహాలు లభ్యం.. కాల్ సెంటర్ ఉద్యోగులుగా గుర్తింపు..

పోలీసులు పశ్చిమ మెక్సికన్ లోని జాలిస్కోలోని ఒక గుంటలో 45 బస్తాలను కనుగొన్నారు. వాటిని తెరిచి చూసిన అధికారులకు షాక్ ఇస్తూ..  అందులో మానవ శరీరాలు కనిపించాయి. మే 20 నుంచి తప్పిపోయిన 30 ఏళ్లలోపు ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులను మాత్రమే కాదు గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన వ్యక్తుల కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు.

Mexico: తప్పిపోయిన ఏడుగురు కోసం వెదుకుతుంటే.. 45 సంచులలో ఉన్న మృత దేహాలు లభ్యం.. కాల్ సెంటర్ ఉద్యోగులుగా గుర్తింపు..
Mexico City
Follow us

|

Updated on: Jun 02, 2023 | 1:10 PM

మెక్సికోలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర మెక్సికోలోని గ్వాడలజారా శివార్లలోని ఒక పెద్ద రాళ్ల గుట్టల మధ్య మృత దేహాలున్న సంచులను అధికారులు కనుగొన్నారు. ఈ సంచులను చూసిన స్థానికులు షాక్ తిన్నారు. పోలీసులు గత వారం తప్పి పోయిన కొందరు యువతీయువకుల కోసం వెదుకుతున్న సమంయంలో ఈ సంచులు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు పశ్చిమ మెక్సికన్ లోని జాలిస్కోలోని ఒక గుంటలో 45 బస్తాలను కనుగొన్నారు. వాటిని తెరిచి చూసిన అధికారులకు షాక్ ఇస్తూ..  అందులో మానవ శరీరాలు కనిపించాయి. మే 20 నుంచి తప్పిపోయిన 30 ఏళ్లలోపు ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులను మాత్రమే కాదు గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన వ్యక్తుల కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు.

కనిపించకుండా పోయిన యువతీయువకులు ఒకే కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారని.. తప్పిపోయిన వారి గురించి వేర్వేరు రోజుల్లో ఫిర్యాదులు అందాయని చెప్పారు పోలీసులు. ఇప్పుడు మృతదేహాలు లభ్యమైన దగ్గరలోనే కాల్ సెంటర్ ఉంది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు మొదలు పెట్టారు. సంచుల్లో ఉన్న మృతులు ఎంతమంది.. ఎవరెవరు అనే విషయం ఫోరెన్సిక్ నిపుణులు  నిర్ధారించాల్సి ఉంది.

కాల్ సెంటర్ అక్రమ కార్యకలాపాలకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తెలిసినట్లు అధికారులు చెప్పారు. గంజాయి,తో పాటు దుస్తులపై రక్తపు మరకలు.. బ్లడ్ ఉన్న క్లీనింగ్ రాగ్‌తో పాటు వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను కనుగొన్నారని స్థానిక మీడియా నివేదించింది. అయితే అధికారులు బాధితులను నేరస్తులుగా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు అదృశ్యమైన వారి బంధువులు.

ఇవి కూడా చదవండి

2021లో జాలిస్కోలోని తోనాలా మున్సిపాలిటీలో, 11 మంది మానవ అవశేషాలతో 70 సంచులు  కనుగొనబడ్డాయి. అంతేకాదు 2019 లో, జపోపాన్‌లోని జనావాసాలు లేని ప్రాంతంలో 119 బ్యాగుల్లో 29 మంది మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో 33 మంది అవశేషాలు గ్వాడలజారా ప్రాంతంలో కనిపించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..