వామ్మో దారుణం..తల్లి మృతదేహాన్ని 13 ఏళ్లుగా ఇంట్లోనే దాచిపెట్టిన కుమారుడు

పొలండ్ లో తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఓ వ్యక్తి ఏళ్లపాటు జీవిస్తున్న ఘటన ఇటీవల వెలుగుచూసింది. మరో విషయం ఏంటంటే మృతదేహం పాడవకుండా ప్రత్యేకంగా భద్రపరచి ఇంట్లో సోఫాలోనే ఉంచడం గమనార్హం

వామ్మో దారుణం..తల్లి మృతదేహాన్ని 13 ఏళ్లుగా ఇంట్లోనే దాచిపెట్టిన కుమారుడు
Death
Follow us

|

Updated on: Mar 29, 2023 | 8:32 PM

పొలండ్ లో తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఓ వ్యక్తి ఏళ్లపాటు జీవిస్తున్న ఘటన ఇటీవల వెలుగుచూసింది. మరో విషయం ఏంటంటే మృతదేహం పాడవకుండా ప్రత్యేకంగా భద్రపరచి ఇంట్లో సోఫాలోనే ఉంచడం గమనార్హం. ఇలా దాదాపు 13 ఏళ్లుగా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని నివసిస్తున్న ఘటన అక్కడి స్థానికులును భయబ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే పోలండ్‌ రాడ్లిన్‌లోని రోగోజినా వీధిలో మరియన్‌ ఎల్‌ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతని ఇంటికి ఇటీవల ఆయన బంధువు ఒకరు వచ్చారు. ఆ సమయంలో మరియన్‌ విచిత్ర చూపులు చూస్తూ ఇంటిబయట తిరుగుతున్నట్లు గమనించాడు. మరియన్ ప్రవర్తనపై అనుమానం ఆయనకు వచ్చింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి గాలించగా.. అక్కడున్న ఓ సోఫా మీద వార్తాపత్రిక కట్టలపై ఓ మృతదేహాన్ని ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించగా.. ఆ వార్తాపత్రికలు కూడా 2009 సంవత్సరం నుంచి ఉన్నట్లు గుర్తించారు.

ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆ ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడున్న మృతదేహాన్ని చూసి కంగుతిన్నారు. గతంలో మరణించిన అతడి తల్లి మృతదేహం అయి ఉంటుందని అనుమానించారు. 2010 జనవరి అతడి తల్లి చనిపోయినట్లు గుర్తించారు. అయితే ఆమెను ఖననం చేసిన ప్రదేశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. అనంతరం సమీపంలోనే ఉన్న శ్మశానవాటిలో అతడి తల్లి శవపేటికను తెరచిచూడగా అది ఖాళీగా కనిపించింది. దీంతో అంత్యక్రియల అనంతరం ఆమెను పూడ్చిపెట్టిన కొన్ని గంటలకే దాన్ని తవ్వి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చాడని పోలీసులు నిర్ధారించారు. రసాయనాలతో భద్రపరచడం వల్లే ఇన్నాళ్లు మృతదేహం కుళ్లిపోలేదని తెలిపారు. మరియన్ ను అరెస్టు చేసి అతడి మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యుల సహాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి