Death penalty: రాళ్లను సేకరించడమే నేరమైంది.. ఏకంగా మరణశిక్ష విధించిన అక్కడి అధికారులు..!

Death penalty: ఇతర దేశాల్లో విధించే శిక్షలతో పోలిస్తే ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల్లో విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి.

Death penalty: రాళ్లను సేకరించడమే నేరమైంది.. ఏకంగా మరణశిక్ష విధించిన అక్కడి అధికారులు..!
Iraq
Follow us

|

Updated on: May 18, 2022 | 10:04 AM

Death penalty: ఇతర దేశాల్లో విధించే శిక్షలతో పోలిస్తే ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి ఇస్లామిక్ దేశాల్లో విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న నేరానికే అక్కడ మరణశిక్షలు విధిస్తుంటారు. తాజాగా ఇరాక్‌లో ఓ బ్రిటీషర్ కూడా మరణశిక్షను ఎదుర్కొంటున్నాడు. అయితే అతడు చేసిన నేరం వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే జిమ్ ఫిట్టన్ అనే బ్రిటీషర్ ఓ రిటైర్డ్ జియాలజిస్ట్. అతడు జర్మనీకి చెందిన ఓ సైంటిస్టుతో కలిసి ఇరాక్‌లోని ఎరీదు ప్రాంతంలో ఉన్న ఓ పురావస్తు క్షేత్రాన్ని సందర్శించాడు. ఆ పురావస్తు కేంద్రం నుంచి గుర్తుగా 12 పురాతన రాళ్లను, కొన్ని కుండలు, జాడీలకు చెందిన పెంకులను వాళ్లిద్దరూ సేకరించారు.

అయితే తమ పురావస్తు సంపదను అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఇరాక్ అధికారులు ఫిట్టన్, జర్మనీ సైంటిస్ట్ వాల్డ్ మాన్‌ను మార్చి 20న బాగ్దాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి ఇరాక్ కోర్టులో హాజరుపరిచారు. తమకు ఇరాక్‌లోని చట్టాలు తెలియదని.. అందుకే రాళ్లను సేకరించామని న్యాయమూర్తి ముందు వాపోయారు. పురావస్తు కేంద్రంలో రాళ్లు సేకరించరాదన్న ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తాము ఈ పని చేశామని తెలిపారు. అయితే ఇరాక్‌లో ఈ నేరం తీవ్రమైనది కావడంతో న్యాయస్థానం మరణశిక్ష విధించింది. కాగా జిమ్ ఫిట్టన్‌ను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలంటూ అతడి కుటుంబ సభ్యులు ఇంగ్లండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఓ పిటిషన్ దాఖలు చేసి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఇప్పటివరకు ఫిట్టన్‌కు మద్దతుగా 1.24 లక్షల మంది సంతకాలు చేశారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??