AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాతో కాళ్లబేరానికి వస్తున్న మలేషియా

పొద్దున్నలేస్తే భారత్‌ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న మలేషియాకు నరేంద్రమోదీ ప్రభుత్వం చుక్కలు చూపించింది… పామాయిల్‌తో మలేషియా మెడలు వంచేసింది… పామాయిల్‌ దిగుమతులను మలేషియా నుంచి తగ్గించి.. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది భారత ప్రభుత్వం… మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై భారీగా దిగుమతి పన్ను విధించింది.. వాస్తవానికి మలేషియా నుంచి ప్రతి సంవత్సరం 40 లక్షల టన్నుల పామాయిల్‌ భారత్‌కు వస్తుంది.. ఇదంతా ఆగిపోయేసరికి మలేషియా ప్రధానికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. ఇప్పుడా […]

ఇండియాతో కాళ్లబేరానికి వస్తున్న మలేషియా
Pardhasaradhi Peri
|

Updated on: Feb 04, 2020 | 8:16 PM

Share

పొద్దున్నలేస్తే భారత్‌ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న మలేషియాకు నరేంద్రమోదీ ప్రభుత్వం చుక్కలు చూపించింది… పామాయిల్‌తో మలేషియా మెడలు వంచేసింది… పామాయిల్‌ దిగుమతులను మలేషియా నుంచి తగ్గించి.. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది భారత ప్రభుత్వం… మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై భారీగా దిగుమతి పన్ను విధించింది.. వాస్తవానికి మలేషియా నుంచి ప్రతి సంవత్సరం 40 లక్షల టన్నుల పామాయిల్‌ భారత్‌కు వస్తుంది.. ఇదంతా ఆగిపోయేసరికి మలేషియా ప్రధానికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. ఇప్పుడా దేశానికి తత్వం బోధపడింది.. కాళ్లబేరానికి వచ్చింది.. వాణిజ్యపరంగా భారత్‌తో తలెత్తిన విభేదాలు త్వరలో సమసిపోతాయని మలేషియా పరిశ్రమల శాఖ మంత్రి థెరిసా కోక్‌ చెప్పడం ఈ కోవకే వస్తుంది.. మలేషియా పామాయిల్‌ ఉత్పత్తులపై భారత్‌ విధించిన నిషేధం తాత్కాలికమైనదని.. త్వరలో నిషేధాన్ని ఎత్తివేస్తుందన్న నమ్మకం తమకుందని థెరిసా కోక్‌ చెప్పుకొచ్చారు.. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మలేషియా ప్రధాని మహతీర్‌ విమర్శిస్తూ వచ్చారు.. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నుంచి మొదలు పెడితే మొన్నీమధ్య సీఏసీ వరకు మహతీర్‌ ఏదో ఒకటి అనసాగారు.. అంతెందుకు కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతమనే సాహసం చేశారు.. ఇలాగైతే లాభం లేదనుకున్న నరేంద్రమోదీ వాణిజ్యపరంగా మలేషియాను గట్టి దెబ్బకొట్టారు.. ప్రపంచంలోనే పామాయిల్‌ అతి పెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్‌… మలేషియా పామాయిల్‌ను కొనకూడదని నిర్ణయించింది.. మలేషియాకు బదులు ఇండోనేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సిందిగా వ్యాపార సంస్థలకు చెప్పింది.. దీంతో మలేషియా తీవ్ర నష్టాల్లోపడింది.. ఇలాగైతే ఎలారా భగవంతుడా అని అనుకుని భారత్‌ను దువ్వే ప్రయత్నం మొదలుపెట్టింది.. అందులో భాగంగానే మలేషియా మంత్రి థెరిసా కోక్‌ సంధిని కాంక్షించే మాటన్నారు.. భారత్‌-మలేషియాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని.. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను రెండు దేశాలు అధిగమిస్తాయని భావిస్తున్నామని… పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని అనుకుంటున్నామని కోక్‌ అన్నాడు. పామాయిల్‌ కొనుగోలుపై ఇండియా నిర్ణయం తాత్కాలికమేనని తాము అనుకుంటున్నామని తెలిపాడు..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం