ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్‌తో ఇరాన్‌ మెరుపు దాడి.. ఒకేసారి 102 బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగించిన ఇరాన్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ మెరుపు దాడి చేసింది. ఇరాన్ నుండి 102 బాలిస్టిక్ క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రభుత్వం, పౌరులు షెల్టర్లలో ఉండాలని కోరారు.

ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్‌తో ఇరాన్‌ మెరుపు దాడి.. ఒకేసారి 102 బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగించిన ఇరాన్
Iran Attack On Israel
Follow us

|

Updated on: Oct 01, 2024 | 10:55 PM

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ మెరుపు దాడి చేసింది. ఇరాన్ నుండి 102 బాలిస్టిక్ క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రభుత్వం, పౌరులు షెల్టర్లలో ఉండాలని కోరారు. IDF హెచ్చరిక తర్వాత ఇజ్రాయెల్ అంతటా సైరన్‌లు మోగుతున్నాయి. ముఖ్యంగా మధ్య, దక్షిణ ఇజ్రాయెల్‌లోని ప్రజలు బంకర్‌లకు వెళ్లాలని కోరారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఇరాన్ క్షిపణులతో పోటీపడటం ప్రారంభించింది. ఇరాన్‌ దాడి చేస్తుందని అమెరికా ముందే హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్‌పై మెరపు దాడి జరగడం గమనార్హం. ఇరాన్‌.. ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడంతో పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలు పెరిగాయి.

హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణించినప్పటి నుండి, ఇజ్రాయెల్‌పై పెద్ద దాడి జరగవచ్చని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించకముందే ఇజ్రాయెల్ దళాలు దాడి భయాన్ని వ్యక్తం చేశాయి. IDF చేసిన ట్వీట్‌లో హిజ్బుల్లా ఇజ్రాయెల్‌లోని అమాయక పౌరులను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా పేర్కొంది.

ఇరాన్ నుండి క్షిపణిని ప్రయోగించిన వెంటనే ఇజ్రాయెల్ తన భద్రతా షీల్డ్ ఐరన్ డోమ్‌ను రంగంలోకి దింపింది. ప్రస్తుతం, ఇరాన్ క్షిపణులను ఆపడంపై ఇజ్రాయెల్ మొత్తం దృష్టి సారిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం, ఐరన్ డోమ్ ఇరాన్ క్షిపణులను ప్రయోగించడం ప్రారంభించిందని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారి తెలిపారు. మేము అన్ని రకాల బెదిరింపులు, దాడులను ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌పై దాడులు మంగళవారం(అక్టోబర్ 1) జాఫా స్టేషన్ నుండి ప్రారంభమయ్యాయి. అక్కడ ఇద్దరు ఉగ్రవాదులు పౌరులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు సాధారణ పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్ ఈ దాడితో వ్యవహరిస్తోంది. ఇంతలో ఇరాన్ నుండి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగా వార్త ఇజ్రాయెల్ పౌరులలో భయాందోళనలను సృష్టించింది.

మరోవైపు, ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్‌లో సైరన్‌ల మోత వినిపిస్తోంది. ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ పూర్తిగా సిద్ధమైంది. వారి పౌరులందరినీ బాంబ్ షెల్టర్లకు పంపారు. ఇరాన్ నుంచి నిరంతరం క్షిపణులు ప్రయోగిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. తదుపరి సూచనల వరకు ప్రజలందరూ రక్షిత ప్రాంతంలో ఉండాలని సైన్యం కోరింది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించారని ఐడీఎఫ్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటే, టెహ్రాన్ ప్రతిస్పందన మరింత ప్రాణాంతకం, విధ్వంసకరమని హెచ్చరించింది.

ఇరాన్ దాడి తర్వాత, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని తెలిపారు. ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇరాన్ క్షిపణి దాడుల నుండి ఇజ్రాయెల్‌ను రక్షించడానికి, ఈ ప్రాంతంలోని యుఎస్ దళాలను రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ సిద్ధంగా ఉందని బిడెన్ స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..