AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Attack: అమెరికా, ఇజ్రాయేల్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇరాన్.. పరిస్థితి క్లిష్టంగా మార్చొద్దని వార్నింగ్!

పశ్చిమాసియా దేశాల్లో మరోసారి చిచ్చు రగిలింది. ఇజ్రాయెల్ చేసిన సైబర్ దాడి ఘటన ఈ చిచ్చుకు కారణం. ఇటీవల ఇరాన్ అణుకర్మాగారంపై ఇజ్రాయేల్ సైబర్ దాడి చేసిన సంగతి తెలిసిందే.

Cyber Attack: అమెరికా, ఇజ్రాయేల్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇరాన్.. పరిస్థితి క్లిష్టంగా మార్చొద్దని వార్నింగ్!
Cyber Attck
KVD Varma
|

Updated on: Apr 13, 2021 | 8:49 PM

Share

Cyber Attack: పశ్చిమాసియా దేశాల్లో మరోసారి చిచ్చు రగిలింది. ఇజ్రాయెల్ చేసిన సైబర్ దాడి ఘటన ఈ చిచ్చుకు కారణం. ఇటీవల ఇరాన్ అణుకర్మాగారంపై ఇజ్రాయేల్ సైబర్ దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ శత్రువు నంతజ్ ప్లాంట్ పై దాడివెనుక ఉందని కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. అదేవిధంగా ఈ విషయంపై అమెరికా పై కూడా తీవ్రంగా విరుచుకుపడింది. ఈ విషయంపై మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమద్ జావేద్ జరీఫ్ తమపై విధ్వాంసాక్రం దాడులు, ఆంక్షలు 2015 నాటి అణు ఒప్పందం పునరుద్ధరణ చర్యలకు ఏ మాత్రం సహకరించవని అన్నారు. ఆంక్షలు, విధ్వాంసాక చర్యలు మాతో రాజీకి దారిచూపించవనే విషయం అమెరికా గ్రహిస్తే మంచిది. ఇటువంటి చర్యలు మరింత క్లిష్టంగా సమస్యను మారుస్తాయి అని తీవ్రంగా చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రి సేర్గే లరోవ్ సమక్షంలోనే నంతాజ్ అణు కర్మాగారంపై సైబర్ దాడి చేయడం చాలా ప్రమాదకర జూదంతో సమానమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అణు ఒప్పందం పునరుద్ధరణ, అమలలో తమకు ఎటువంటి సమస్యలేదని ఆయన స్పష్టం చేశారు.

నంతాజ్ అణు కర్మాగారాన్ని ఇరాన్ అధ్యక్షుడు పునః ప్రారంభించిన కొద్ది గంటల్లోనే అందులోని విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దీని వెనుక ఇజ్రాయేల్ హస్తం ఉందని ఆ దేశ మీడియానే స్వయంగా వెల్లడించింది. ఇరాన్ మాత్రం స్వల్ప విద్యుత్ ప్రమాదం జరిగినట్టు ఇరాన్ అటామిక్ రెగ్యులేటరీ ప్రకటించింది. అయితే, ప్లాంట్‌లోని విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు అమెరికా, ఇజ్రాయేల్ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడిలో తమ హస్తం లేదని అమెరికా ధ్రువీకరించింది.

Also Read: UK Covid-19: బ్రిటన్‌లో కరోనా థర్డ్ వేవ్ భయాలు..50 వేల మందికి ‘ప్రాణ గండం’..వైద్య నిపుణుల హెచ్చరిక

Corona Vaccine: వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. విదేశీ టీకాల అనుమతి ఇచ్చే యోచన..?

Follow Us
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
పదో తరగతి ఫలితాలు 2026 వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
అతడికి 57 ఏళ్లు.. 18 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్‌ను డైరెక్టుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
ఏసీ vs ఎయిర్ కూలర్.. ఈ మండు వేసవిలో మీ ఇంటికి ఏది బెస్ట్?
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
యూపీ చరిత్రలో కొత్త అధ్యాయం.. 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే' ప్రారంభం!
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో 15 ఏళ్ల సంచలనం
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు.. నన్ను కూడా లైంగికంగా...
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
మారుతీ సుజుకి కారుపై రూ.2.15 లక్షల భారీ తగ్గింపు..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..
తారక్ ప్రాణ స్నేహితులు.. ఎన్టీఆర్ పాత ఫోటోలో ఆ ఇద్దరు ఎవరంటే..