AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌ను కాదని.. చైనాతో ఇరాన్ ఒప్పందం

భారత్-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ భారత్‌కు షాక్ ఇచ్చింది. చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్ ఈ ప్రకటన చేయడం విశేషం.

భారత్‌ను కాదని.. చైనాతో ఇరాన్ ఒప్పందం
Balaraju Goud
| Edited By: |

Updated on: Jul 14, 2020 | 3:49 PM

Share

భారత్-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ భారత్‌కు షాక్ ఇచ్చింది. చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్ ఈ ప్రకటన చేయడం విశేషం. గత నాలుగేళ్ల తరువాత కూడా ఈ ప్రాజెక్టుకు భారతదేశం నిధులు ఇవ్వడం లేనందుకే తామే ఈ ప్రాజెక్టును స్వయంగా పూర్తి చేసుకుంటామని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా మరో వివాదానికి దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

చాబహర్ ఓడరేవు నుంచి జహేదాన్ మధ్య చాబహర్ రైలు ప్రాజెక్టును నిర్మించాల్సి భారత్, ఇరాన్ మధ్య గతంలో ఒప్పందం కుదిరింది. 628 కిలోమీటర్ల పొడవైన ఈ ట్రాక్ నిర్మాణాన్ని గత వారం ఇరాన్ రవాణా మంత్రి మొహమ్మద్ ఇస్లామి ప్రారంభించారు. ఇరాన్ తన రైల్వే మార్గాన్ని ఆఫ్ఘనిస్తాన్ లోని జరంజ్ సరిహద్దు వరకు విస్తరించాలని నిర్ణయించింది. 2022 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో చాబహర్ రైలు ప్రాజెక్టును నిర్మాణం చేపట్టారు. ఇందుకు భారత ప్రభుత్వ రైల్వే సంస్థ ఇర్కాన్ పూర్తి చేయాల్సి ఉంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ తోసహా ఇతర మధ్య ఆసియా దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించతలపెట్టారు. ఈమేరకు ఇరాన్, భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.

ఇరాన్ పర్యటన సందర్భంగా 2016 లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చాబహర్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టుపై సుమారు 6 1.6 బిలియన్లు పెట్టుబడి పెట్టాలి. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారతదేశం నుంచి ఇంజనీర్లు కూడా ఇరాన్‌కు వెళ్లారు. అయితే, అమెరికా ఆంక్షల భయంతో భారత్ రైలు ప్రాజెక్టు పనులను మొదలుపెట్టలేదు. మరోవైపు అమెరికాతో డ్రాగన్ దేశం మద్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో భాగంగా ఇరాన్‌ను నియంత్రించడానికి చైనా ప్రయత్నించింది. ఈ సిరీస్‌లో ఇరాన్ తో చైనా ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకోబోతున్నది. ఇరాన్ నుంచి చాలా తక్కువ ధరకు చమురును దక్కించుకునేలా చైనా ఎత్తుగడ వేసింది. బదులుగా ఇరాన్‌లో 400 బిలియన్ డాలర్లు పెట్టుబడులను చైనా ప్రభుత్వం పెట్టడానికి ఒప్పదం కుదుర్చుకుంది. అంతే కాకుండా, ఇరాన్‌కు అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు చైనా అంగీకరించింది.

Follow Us
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి