Cleaning of The Corpses: సమాధి నుంచి మృత దేహాన్నివెలికి తీసి సంవత్సరీకం జరిపే గ్రామం..

ప్రపంచంలో అనేక ప్రాంతాలు.. ఈ ప్రాంతాల్లోని ప్రజల్లో జన్మలపై.. మరణాల పై రకరకాల విశ్వాసాలు.. తమ తమ మత విశ్వాసాలు, ఆచారాలు, పద్దతులను ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్దాసక్తులతో పాటిస్తారు. ఇక మనిషి మరణం పై ఒక్కొక్క ప్రాంతంలో..

Cleaning of The Corpses: సమాధి నుంచి మృత దేహాన్నివెలికి తీసి సంవత్సరీకం జరిపే గ్రామం..
Follow us

|

Updated on: Feb 02, 2021 | 8:27 AM

Cleaning of The Corpses: ప్రపంచంలో అనేక ప్రాంతాలు.. ఈ ప్రాంతాల్లోని ప్రజల్లో జన్మలపై.. మరణాల పై రకరకాల విశ్వాసాలు.. తమ తమ మత విశ్వాసాలు, ఆచారాలు, పద్దతులను ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్దాసక్తులతో పాటిస్తారు. ఇక మనిషి మరణం పై ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశ్వాసం.. ఈ కోవలోకే వచ్చేవి.. ఈజిప్టు పిరమిడ్లు. భారత్, చైనా, కొరియా, అమెరికా ఇలా ఏదేశమైన వారి వారి సంప్రదాయాలను అనుసరించి మరణించినవారిని గౌరవిస్తారు. ఇక మనదేశంలో అయితే మనిషి మరణం తర్వాత.. కర్మకాండలు నిర్వహించడం.. ఏడాదికి ఒకసారి.. సంవత్సరీకం అంటూ మరణించిన వారిని గుర్తుకు చేసుకోవడం చేస్తుంటాం. కానీ కొన్ని ప్రాంతాల్లోని కొన్ని తెగల్లో ఆచారాలు భీతిగొలిపేవిగా, అసలు ఇటువంటి ఆచారాలు ఉంటాయా ..? అనిపించేవిగా ఉంటాయి. ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇండోనేషియాలోని ఓ గ్రామంలో సంవత్సరీకాలు షాక్ కలిగించేవిగా ఉంటాయి.

ఇండోనేషియాలోని రిందిగాల్లో గ్రామ ప్రజలు నమ్మకాలు, విశ్వాసాలు ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి.. మరణించిన వ్యక్తి పై ఆ గ్రామ ప్రజలు చూపే ప్రేమ, గౌరవం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరణించిన వ్యక్తిని ఏడాదికి ఒకసారి సంవత్సరీకం పేరుతో గుర్తు చేసుకోవడం.. సహజం.. వారిపేరుతో అన్నదానం, వస్త్ర దానం వంటివి నిర్వహిస్తాం.. కానీ రిందిగాల్లో గ్రామ ప్రజలు మాత్రం మరణించిన వారి పార్ధివ దేహాన్ని ఏడాదికి ఒకసారి సమాధి నుంచి వెలికితీస్తారు. అనంతరం వాటిని రసాయనాలతో శుభ్రపరుస్తారు. వారు బతికి ఉన్నప్పుడు ఎలా జీవించారో అదే విధంగా శవాలను రెడీ చేస్తారు. వారికి నచ్చిన రంగుల దుస్తులను ధరింప జేసి, సిగరెట్లు, కళ్ళజోడు, తినే ఆహార పదార్ధాలను ఏర్పాటు చేస్తారు.. తర్వాత శవాలను ఇంటికి తీసుకొని వచ్చి.. బతికి ఉన్న సమయంలో ఏ ప్లేస్ లో ఇష్టంగా కూర్చుండే వారో ఆ స్థలంలో కూర్చోబెడతారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తారు. రోజంతా వారు పండగలా సంబరాలు చేసుకొంటారు.. సాయంత్రం అయ్యేసరికి గ్రామస్తుల మొహాల్లో విషాదఛాయలు కనిపిస్తాయి. చీకటి పడిన తర్వాత గ్రామస్తులంతా శవాలను తిరిగి భధ్రంగా స్మశానానికి చేరుస్తారు.. యధావిధిగా సమాధిని మూసేస్తారు.. రాత్రంతా వారు జాగరణ చేస్తూ మరణించినవారిని తలుచుకుంటూ గడుపుతారు.. ఇదండీ.. ఇక్కడ మనిషి మరణించిన తర్వాత సంవత్సరీకాలు జరిపే విధానం..!

Also Read: నిన్నటి నుంచి ఈరోజుకి బంగారం ధర తగ్గితే … భారీగా పెరిగిన వెండి ధర

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??