కరోనా ఎఫెక్ట్: మన దేశ ర్యాంకు ఎంతంటే..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరణ రోజురోజుకు పెరుగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు ఆ దేశం సహా ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య వెయ్యికి దాటింది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి విస్తరణపై హంబోల్ట్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు మోడల్ నెట్వర్క్ ద్వారా సర్వే చేశారు. ఈ జాబితాలో భారత్ 17వ స్థానంలో ఉంది. భారత్లో 3 కరోనా […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరణ రోజురోజుకు పెరుగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు ఆ దేశం సహా ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య వెయ్యికి దాటింది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి విస్తరణపై హంబోల్ట్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు మోడల్ నెట్వర్క్ ద్వారా సర్వే చేశారు. ఈ జాబితాలో భారత్ 17వ స్థానంలో ఉంది. భారత్లో 3 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా 4వేల విమానాశ్రయాలు, 25వేలకు ప్రత్యక్ష సంబంధమున్న మార్గాల్లో ఈ పరిశోధన జరిగింది. వైమానిక ప్రయాణీకుల ద్వారా ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని ఈ సర్వేలో తేల్చారు. పరిశోధనల అంచనా ప్రకారం కరోనా వైరస్ సోకే ప్రమాదమున్న మొదటి 10 దేశాలుగా థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్, అమెరికా, వియత్నాం, మలేషియా, సింగపూర్, కంబోడియాలు ఉన్నాయి. ఇక ఈ వైరస్ విస్తరణ ప్రభావానికి సంబంధించి భారత్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టాప్ రిస్క్లో ఉంది. ఆ తరువాత ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోచి విమానాశ్రయాలు ఉన్నాయి.