AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధమే ఆపినోడ్ని.. వీళ్లను ఆపలేనా..? డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య రాజీ పడాలని ఆయన కోరారు. ఇంతకుముందు భారత్-పాకిస్థాన్ మధ్య శాంతిని నెలకొల్పానని, ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ వివాదాన్ని కూడా పరిష్కరిస్తానని ట్రంప్ ప్రకటించారు.

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధమే ఆపినోడ్ని.. వీళ్లను ఆపలేనా..? డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
Donald Trump
SN Pasha
|

Updated on: Jun 15, 2025 | 9:41 PM

Share

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రాణాంతక ఘర్షణల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్‌, పాకిస్తాన్ మధ్య తాను గతంలో శాంతిని నెలకొల్పానని, ఇప్పుడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా ఆపుతానని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కచ్చితంగా శాంతి నెలకొంటుందని, ఇద్దరూ రాజీ పడాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌, పాకిస్తాన్ మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతను నేను ముగించాను. అదేవిధంగా, ఈ యుద్ధం కూడా త్వరలో ముగుస్తుంది. అనేక సమావేశాలు, ఫోన్ కాల్స్ జరుగుతున్నాయి. తాను ఎల్లప్పుడూ పెద్ద పనులు చేస్తానని కానీ క్రెడిట్ తీసుకోనని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇండో-పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ ప్రమేయం లేదని భారత ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే.

కాగా, అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై జరుగుతున్న చర్చలు అకస్మాత్తుగా రద్దు అయిన సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆరో రౌండ్ చర్చలు ఆదివారం జరగాల్సి ఉంది, కానీ పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అవి ఆగిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ట్రంప్ శాంతి కోసం చేసిన విజ్ఞప్తిని కొత్త చొరవగా చూస్తున్నారు. ట్రంప్ తన ప్రకటనలో మధ్యప్రాచ్యాన్ని మళ్ళీ గొప్పగా మారుస్తామని కూడా అన్నారు.

ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడి హెచ్చరిక

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులలో అమెరికా కూడా ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో అన్నారు. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ అలాంటి చర్య తీసుకోదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే దాడులు కొనసాగితే, ఇరాన్ సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్ మరింత శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు. దూకుడు పెరిగితే, ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుందని అమెరికాను కూడా హెచ్చరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి