Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lottery: దీపావళికి జాక్‌పాట్‌ కొట్టేశాడు.. లక్కీ డ్రాలో కిలో బంగారం గెలుచుకున్న భారత ఇంజనీర్‌

మనిషి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. భారతదేశంలో దీపావళి పండుగ ప్రారంభమైంది. మార్కెట్‌లో బంగారం, వెండిని ప్రజలు భారీగా కొనుగోలు చేస్తున్నారు..

Lottery: దీపావళికి జాక్‌పాట్‌ కొట్టేశాడు.. లక్కీ డ్రాలో కిలో బంగారం గెలుచుకున్న భారత ఇంజనీర్‌
Indian Software Engineer
Follow us
Subhash Goud

|

Updated on: Oct 24, 2022 | 8:49 AM

మనిషి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. భారతదేశంలో దీపావళి పండుగ ప్రారంభమైంది. మార్కెట్‌లో బంగారం, వెండిని ప్రజలు భారీగా కొనుగోలు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇక ఓ ఇంజనీర్‌కు పంగడ సందర్భంగా అదృష్టం వరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో వారంవారీ లక్కీ డ్రాలో భారతీయ ఇంజనీర్ 1 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని గెలుచుకున్నాడు. అబుదాబిలో ప్రతి వారం బిగ్ టికెట్ లక్కీ డ్రా జరుగుతుంది. ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన వారు ఈ లక్కీ డ్రాకు స్వయంచాలకంగా ఎంపిక చేయబడతారు. దీని తర్వాత కంప్యూటర్ సహాయంతో ప్రతి వారం విజేతను ఎంపిక చేస్తారు.

18 మంది నుండి విజేతగా ఎంపిక

ఈ లక్కీ డ్రా 16 అక్టోబర్ 2022న తీయడం జరిగింది. గతంలో ఈ లక్కీ డ్రా కోసం మొత్తం 18 మంది టిక్కెట్లు కొనుగోలు చేశారు. దీని తర్వాత లక్కీ డ్రా ఫలితం ప్రకటించడానికి ఒక రోజు ముందు భారతీయ పౌరుడు జయకుమార్ ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. 16 అక్టోబర్ 2022న లక్కీ డ్రా తీయగా, జయకుమార్‌కు ఈ వారపు బహుమతిలో రెండవ విజేత అయ్యాడు. అతను 24 క్యారెట్ల 1 కిలోల బంగారాన్ని బహుమతిగా అందుకున్నాడు.

చాలా ఏళ్లుగా టిక్కెట్లు కొంటున్నాను..

జయకుమార్ భారతదేశానికి చెందినవాడు. గత మూడు సంవత్సరాలుగా అబుదాబిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2019 సంవత్సరం నుండి అతను ఈ లక్కీ డ్రా కోసం టిక్కెట్లను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ఈ సందర్భంగా జయకుమార్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఈ లక్కీ డ్రా కోసం గత కొన్నేళ్లుగా టిక్కెట్లు కొంటున్నానని, ఏదో ఒక రోజు లాటరీ కూడా గెలుస్తాననే ఆశతో అన్నానని చెప్పుకొచ్చాడు.

త్వరలో 56 కోట్ల లాటరీ విజేత పేరు వెల్లడి

31 అక్టోబర్ 2022 వరకు ప్రతి వారం బిగ్ టికెట్ లాటరీ ద్వారా ఒక విజేత పేరు ప్రకటించబడుతుంది.. దాని లాటరీలో మొదటి విజేతకు 25 మిలియన్ దిర్హామ్‌లు లేదా దాదాపు రూ. 56 కోట్ల బహుమతి లభిస్తుంది. ఇంతకుముందు సజ్జాద్ అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్ బ్రాంచ్ లాటరీలో భారతదేశానికి చెందిన సజాద్ అలీ భట్ మొత్తం 1 మిలియన్ దిర్హామ్‌ల లాటరీని గెలుచుకున్నాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి