
బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలో శుక్రవారం (ఫిబ్రవరి 27) రాత్రి భారీ విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 15 మంది మరణించారు. విమానాశ్రయానికి సమీపంలోని హైవేపై విమానం కూలిపోయింది. ఆగి ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. మిలటరీకి చెందిన కార్గో విమానంలో పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నట్లు సమారం. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా నోట్ల కట్టలు పడిపోయాయి.
రాజధాని లా పాజ్కు ఆనుకుని ఉన్న ఎల్ ఆల్టో నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారని అగ్నిమాపక అధికారి పావెల్ తోవర్ తెలిపారు. అయితే, మృతులు విమానంలో ఉన్నారా లేదా హైవేపై నిలిపి ఉంచిన వాహనాల్లో ఉన్నారా అని ఆయన పేర్కొనలేదు. విమాన శిథిలాలు, కాలిపోయిన వాహనాలు, హైవే అంతటా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ప్రమాదంలో 15 కి పైగా వాహనాలు కూడా దెబ్బతిన్నాయని సమాచారం. ప్రమాదం తరువాత, విమానాశ్రయం నుండి అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఆ విమానం బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానంగా గుర్తించారు. అది సెంట్రల్ బ్యాంక్ నుండి ఇతర నగరాలకు కొత్త కరెన్సీ నోట్లను తీసుకువెళుతోంది. ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. విమానం రోడ్డుపై వాహనాలను ఢీకొన్న వెంటనే నోట్ల కట్టలు గాలిలో చెల్లాచెదురుగా పడ్డాయి. ఇది తీవ్ర భయాందోళనలకు కారణమైంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వేరే దృశ్యాన్ని చూపించాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా, చెల్లాచెదురుగా ఉన్న డబ్బును తీసుకోవడానికి జనం పరుగెత్తారు. నేలపై చెల్లాచెదురుగా ఉన్న నోట్లను సేకరిస్తున్నట్లు కనిపించింది. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. ఇక ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
Video from the site where a Bolivian Air Force plane crashed in El Alto. Reports of multiple victims, but the number onboard remains unclear.https://t.co/uuunbpGFdh
— AZ Intel (@AZ_Intel_) February 27, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..