USA: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. ఎందుకో తెలుసా.?
ఇటీవల కాలంలో తెలుగు విద్యార్థులు అమెరికాలో మృత్యువాత పడుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మరో తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందిన ఘటన వెల్లడైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయాడు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది.
ఇటీవల కాలంలో తెలుగు విద్యార్థులు అమెరికాలో మృత్యువాత పడుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, మరో తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందిన ఘటన వెల్లడైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయాడు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టేందుకు దిగిన కిరణ్.. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితులు కిరణ్కు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వారికి కూడా ఈత రాకపోవడంతో నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. కిరణ్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందని చిగాగో ఎంబసీ నిర్ధారించింది. కిరణ్ డెడ్బాడీని ఇండియాకు పంపించేందుకు రెండు మూడు రోజులు పడుతుందని తెలిపారు. కిరణ్ కుటుంబం హైదరాబాద్లో నివసిస్తోంది. కిరణ్ మృతితో అతడి స్వగ్రామం చిన్న కోరుకొండిలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతడి మరణ వార్త విని కుటుంబం సోకసంద్రంలో మునిగిపోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

