పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా ??
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయని 5 లక్షల మంది మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. పన్ను చెల్లింపుల పరిధిని పెంచడంపై ఇటీవల పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ దృష్టిపెట్టింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయని 5 లక్షల మంది మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. పన్ను చెల్లింపుల పరిధిని పెంచడంపై ఇటీవల పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ దృష్టిపెట్టింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. వీరు గత మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరానికైనా తమ ఆదాయాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది. అయితే, నోటీసులు వచ్చినప్పటికీ 5 లక్షల మంది రిటర్నులను దాఖలు చేయలేదు. పన్ను చెల్లించని వారి సిమ్ కార్డులను వెంటనే బ్లాక్ చేయాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ సహా అన్ని టెలికాం ప్రొవైడర్లను ఎఫ్బీఆర్ ఆదేశించింది. దీనిపై మే 15 లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్ మెట్రో ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్.. కానీ అతని షర్ట్లోనే ఉంది అసలు ట్విస్ట్
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

