పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా ??
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయని 5 లక్షల మంది మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. పన్ను చెల్లింపుల పరిధిని పెంచడంపై ఇటీవల పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ దృష్టిపెట్టింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది. గతేడాది ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేయని 5 లక్షల మంది మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. పన్ను చెల్లింపుల పరిధిని పెంచడంపై ఇటీవల పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ దృష్టిపెట్టింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. వీరు గత మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరానికైనా తమ ఆదాయాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది. అయితే, నోటీసులు వచ్చినప్పటికీ 5 లక్షల మంది రిటర్నులను దాఖలు చేయలేదు. పన్ను చెల్లించని వారి సిమ్ కార్డులను వెంటనే బ్లాక్ చేయాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ సహా అన్ని టెలికాం ప్రొవైడర్లను ఎఫ్బీఆర్ ఆదేశించింది. దీనిపై మే 15 లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్ మెట్రో ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్ అంబాసిడర్.. కానీ అతని షర్ట్లోనే ఉంది అసలు ట్విస్ట్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

