AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌, బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం !! దాడుల్లో దెబ్బతిన్న కేబుల్స్

ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌, బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం !! దాడుల్లో దెబ్బతిన్న కేబుల్స్

Phani CH
|

Updated on: Feb 29, 2024 | 11:00 AM

Share

ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై ఇప్పటివరకు దాడి చేసిన హౌతీ రెబల్స్​, ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుల్స్‌పై దాడులు మొదలుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్రపంచలోని ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌లో 17 శాతానికి సంబంధించిన కేబుల్స్‌ ఈజిప్ట్‌లోని సూయజ్‌, బాబ్‌-ఎల్‌-మండెప్‌ జలసంధుల మీదుగా యూరోప్‌-ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి. ముఖ్యంగా గేట్‌ ఆఫ్‌ టియర్స్‌గా పేరున్న యెమెన్‌-జిబూటీ, ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు 32 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.

ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై ఇప్పటివరకు దాడి చేసిన హౌతీ రెబల్స్​, ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుల్స్‌పై దాడులు మొదలుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్రపంచలోని ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌లో 17 శాతానికి సంబంధించిన కేబుల్స్‌ ఈజిప్ట్‌లోని సూయజ్‌, బాబ్‌-ఎల్‌-మండెప్‌ జలసంధుల మీదుగా యూరోప్‌-ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి. ముఖ్యంగా గేట్‌ ఆఫ్‌ టియర్స్‌గా పేరున్న యెమెన్‌-జిబూటీ, ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు 32 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులో ఈ తీగలను పరిచారు. అయితే సాధారణ డైవర్లు ఇక్కడికి చేరడం దాదాపు అసాధ్యం. అమెరికా, రష్యా నౌకాదళాలకు మాత్రమే వీటిని కత్తిరించే సామర్థ్యం ఉంది. ప్రత్యేకమైన పరికరాలు, వాహనాలను దీనికోసం వాడాల్సి ఉంటుంది. హౌతీలు డైవర్లు, నౌకలకు వాడే మైన్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. తాజాగా భారత్‌-బ్రిటన్‌ మధ్య ఉన్న కీలక కమ్యూనికేషన్‌ లైన్‌ సహా నాలుగు కేబుల్స్​పై దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో భారత్‌-యూరోప్‌ మధ్య సేవలు అందించేవే ఎక్కువగా ఉన్నట్లు నిపుణలు భావిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. మూడు రోజుల కార్యక్రమాలు ఇవే

మూగ జీవుల సంరక్షణకు 3 వేల ఎకరాల్లో అడవి ఏర్పాటు

కేరళలో రోడ్డుకు ఘనంగా పెళ్లి !! ఎందుకంటే ??

పాకిస్తాన్ లోని పంజాబ్‌ కు తొలి మహిళా సీఎం.. చరిత్ర సృష్టించిన మరియం నవాజ్‌

కుమారుడు మృతిని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా ??