Vande Bharat: మరోమారు వందేభారత్ రైలుపై రాళ్లు.! దాడితో రైలు కిటికీలు ధ్వంసం.
వందేభారత్ రైలు ప్రారంభించిన తొలినాళ్లలో అనేక చోట్ల ఈ రైలుపై రాళ్లు రువ్వారు. కారణం ఏదైనా వందేభారత్ వేగానికి ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ రైలు వేగానికి కొన్ని చోట్ల జంతువులు మృత్యువాతపడ్డాయి. ఒకానొక సందర్భంలో ఈ వందేభారత్ రైలులో వర్షపు నీరు లీకైంది కూడా. ఇలా పలు విమర్శలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు విజయవంతంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్ సేవలు కొనసాగుతున్నాయి.
వందేభారత్ రైలు ప్రారంభించిన తొలినాళ్లలో అనేక చోట్ల ఈ రైలుపై రాళ్లు రువ్వారు. కారణం ఏదైనా వందేభారత్ వేగానికి ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ రైలు వేగానికి కొన్ని చోట్ల జంతువులు మృత్యువాతపడ్డాయి. ఒకానొక సందర్భంలో ఈ వందేభారత్ రైలులో వర్షపు నీరు లీకైంది కూడా. ఇలా పలు విమర్శలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు విజయవంతంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్ సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోమారు ఈ వందేభారత్ రైలుపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో రైల్వేశాఖలో మరోమారు కలలకం చెలరేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై శ్రీరాజ్ నగర్-బచ్రావాన్ మధ్య రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. గేట్ నంబర్ 178 సమీపంలో రైలుపై బయటి నుంచి ఎవరో రాళ్లు విసిరారు. దీంతో రైలులోని సీ-3 కోచ్ కిటికీ అద్దం బద్దలయ్యింది. రైలు టెక్నీషియన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

