పసిఫిక్ మహా సముద్రం మీదుగా విమానం..ఉన్నట్టుండి పసికందు ఏడుపు..? షాక్లో ప్రయాణికులు!
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరలవుతున్నాయి. అయితే వీటిల్లో కొన్ని షాకింగ్ వీడియోలు కాగా, మరికొన్ని ఫన్నీ వీడియోలు కూడా చాలా సందర్భాల్లో నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి...
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు క్షణాల్లో వైరలవుతున్నాయి. అయితే వీటిల్లో కొన్ని షాకింగ్ వీడియోలు కాగా, మరికొన్ని ఫన్నీ వీడియోలు కూడా చాలా సందర్భాల్లో నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. తాజాగా గగన వీధుల్లో విహరిస్తున్న విమానంలో ఇద్దరు ఎయిర్హోస్టర్స్ షేర్ చేసిన వార్త వైరల్గా మారింది.
అది పసిఫిక్ మహా సముద్రం..ఆ సముద్రం మీదుగా ఓ విమానం ప్రయాణిస్తోంది. అందులోని ప్రయాణికులంతా హాయిగా నిద్రపోతున్నారు. కొందరు మాత్రం చేతుల్లో సెల్ఫోన్లు, న్యూస్ పేపర్స్ చదువుకుంటూ గడుపుతున్నారు. ఇంతలోనే ఇద్దరు ఎయిర్హోస్టర్స్ కంగారు పడుతూ అటుఇటు పరిగెడుతున్నారు. అది చూసిన ప్రయాణికులు కూడా భయపడిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనపడ్డారు. ఇంతలో నిద్రపోతున్న ప్యాసింజర్లు సైతం మేల్కున్నారు. అందరిలోనూ ఒకటే భయం..విమానానికి ఏదైనా ప్రమాదం జరగబోతుందా అని భయపడిపోయారు. కానీ, ఇంతలోనే ఆ ఇద్దరు ఎయిర్ హోస్టర్స్ ఓ ప్రకటన చేశారు..ఈ విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా..? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగానే, ఉన్నట్టుండి విమానంలో పసికందు ఏడుపు వినిపించింది. అంతే! అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత ఎత్తులో ఉన్న విమానంలో అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏడుపు ఎక్కడ్నుంచి వచ్చిందో అర్థం కాక ప్రయాణికులంతా ఆందోళనపడ్డారు. అంతలోనే ఆ ఇద్దరు ఎయిర్హోస్టర్స్..అసలు విషయం చెప్పారు.
హావాయి వెళ్తోన్న సదరు డెల్టా ఫ్లైట్లో ఓ నిండు గర్భిణీ ప్రయాణిస్తుందట. ఫ్లైట్ సరిగ్గా పసిఫిక్ మహా సముద్రం మీదుగా వెళ్తుండగా, ఉన్నట్టుండి ఆ గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో డాక్టర్ కోసం ఎయిర్ హోస్టర్స్ ప్రయత్నించేలోగానే, ఆమెకు డెలీవరి అయిపోయింది. పడంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారట. ఇదంతా విమానంలో ఉన్న ఇద్దరు ప్యాసింజర్లు వీడియో తీసి టిక్టాక్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.