భర్త కళ్లలో కారం కొట్టి..కాలితో తొక్కి చంపిన భార్య..ఎందుకంటే వీడియో
భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో విలువ వుంది. ఈ వివాహ వ్యవస్థపై గౌరవంతో.. విదేశీయులు సైతం ఖండాంతరాలు దాటివచ్చి భారతీయ యువతీ,యువకులను వివాహం చేసుకుంటున్నారు. పాశ్యాత్యులు సైతం కీర్తిస్తున్న మన పవిత్ర వివాహ వ్యవస్థకు ఇటీవలి కాలంలో కొందరు దుర్మార్గులు మచ్చ తెస్తున్నారు.వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని భర్త, భార్య, పిల్లలు అని చూడకుండా దారుణంగా కడతేరుస్తున్నారు. వీరి నిర్వాకంతో వివాహ వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఇలాంటి దారుణమే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిందో భార్య. కడశెట్టిహళ్లి గ్రామానికి చెందిన శంకరమూర్తి తన వ్యవసాయ క్షేత్రంలోని ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయన భార్య సుమంగళ తిప్టూరులోని కల్పతరు బాలికల హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు కరదాలుశాంతే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సుమంగళ, ప్రియుడు నాగరాజుతో కలిసి మర్డర్కు స్కెచ్ వేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం.. జూన్ 24న ఇంట్లో ఉన్న భర్త శంకరమూర్తి కళ్లలో సుమంగళ కారం చల్లి.. కర్రతో దారుణంగా కొట్టి, గొంతుపై కాలితో తొక్కి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కుక్కి, సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తురువెకెరె తాలూకాలోని దండనిశివర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పొలంలోని బావిలో పడేసింది.
మరిన్ని వీడియోల కోసం :
ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం..ఎందుకో తెలుసా?వీడియో