ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం..ఎందుకో తెలుసా?వీడియో
ప్రపంచ ప్రఖ్యాత పూరి జగన్నాథ రథయాత్రా కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. దీనిని సామరస్యతకు, ఐక్యతకు, భక్తికి చిహ్నంగాను భక్తులు భావిస్తారు. ఈ వేడుకలో భాగంగా జగన్నాధుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలు తమ తమ రథాలపై నగర పర్యటనకు వెళతారు. ఈ క్రమంలో ఆ రథాలు గుడి నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న జగన్నాధుడి ముస్లిం భక్తుడు సాలబేగా సమాధి వద్ద క్షణం ఆగి ఆ తర్వాతే ముందుకు కదులుతాయి. దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉందని చెబుతారు.
ముఘల్ సుబేదార్ కుమారుడు సాలబేగా పూరి జగన్నాధుడి మహిమను విని స్వామిని దర్శించుకోవాలని మందిరానికి వెళతాడు. అయితే హైందవ వేతరులకు ఆలయ ప్రవేశం లేదంటూ అధికారులు ఆయనను లోపలికి వెళ్ళనీయకపోవడంతో నిరాశపడతాడు. నాటి నుంచి స్వామి మీద ఆసక్తి, భక్తిగా మారి నిరంతరం జగన్నాధుని పూజిస్తూ భజనలు, కీర్తనలు పాడటం మొదలుపెడతాడు. ఒక ఏడాది రథయాత్ర సమయానికి సాలబేగా జబ్బుపడతాడు. లేవలేకపోతాడు. ఇంటి ముందు నుంచి స్వామి రథం వెళుతున్నా చూడలేకపోయాడని తెగ బాధపడిపోతాడు. అయితే సరిగ్గా ఆ సమయానికి బిగ్గరగా భక్తుల నామస్మరణ వినిపిస్తుంది. అంతేకాదు ఆ మూడు దివ్య రథాలు సరిగ్గా ఆ ప్రధాన వీధిలోనే ఆయన ఇంటి ముందు ఆగిపోతాయి.
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
Latest Videos
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
