ఆడుకుందామని గ్రౌండ్కి వెళ్లారు..అక్కడి కనిపించింది చూసి షాక్ వీడియో
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గీతా మందిరం సమీపంలోని గ్రౌండ్ లో నిమ్మకాయలు, కూడిగుడ్లు, బూడిద వంటి వస్తువులతో పూజలు నిర్వహించిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ గ్రౌండ్ యువత, చిన్న పిల్లలు నిత్యం క్రీడలాడుకునే ప్రదేశం కావడంతో ఇలాంటి ఘటనలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గీతా మందిరం సమీపంలోని గ్రౌండ్ లో నిమ్మకాయలు, కూడిగుడ్లు, బూడిద వంటి వస్తువులతో పూజలు నిర్వహించిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ గ్రౌండ్ యువత, చిన్న పిల్లలు నిత్యం క్రీడలాడుకునే ప్రదేశం కావడంతో ఇలాంటి ఘటనలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంతేకాక స్థానిక బస్టాండ్ వద్ద సెల్ ఫోన్ దుకాణం వద్ద కూడా అక్షింతలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలను పడేయడంతో దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. వరుస ఘటనలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. క్షుద్ర పూజల వెనుక ఎవరున్నారనే దానిపై ధర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజలు తమ సందేహాలను వెల్లడిస్తూ పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్పేస్ లో అద్భుతాలు చేస్తున్న ప్రస్తుత సమయంలో ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జనవిజ్ఞాన వేదిక వాళ్ళు తెలిపారు.
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
