ఓర్నీ..బస్సులో ఇలా కూడా ప్రయాణించొచ్చా!వీడియో
సాధారణంగా రైళ్లలో ప్రయాణించేటప్పుడు ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని బెర్త్లు కన్ఫర్మ్ చేసుకొని ప్రయాణిస్తుంటారు. ఇక పండుగలప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక రిజర్వేషన్తో సంబంధం లేకుండా జనరల్ ప్రయాణికులు కూడా రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కేసి ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చుని ప్రయాణిస్తుంటారు. జనరల్ బోగీల్లో అయితే లగేజ్ కోసం ఏర్పాటు చేసిన చోటకూడా కూర్చుని ప్రయాణిస్తుంటారు కొందరు. రైళ్లలో ఇది సహజం.
బస్సులో కూర్చోడానికి ప్లేస్ లేదని ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే అవాక్కవుతారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎక్కడికో వెళ్తూ ఓ బస్సు ఎక్కాడు. ఆ బస్సు చూస్తే ఫుల్ రద్దీగా ఉంది. కూర్చోడానికి ఎక్కడా సీట్లు ఖాళీలేవు. నిలబడే ప్రయాణించాలి. కొంతదూరం నిలబడి ప్రయాణించిన అతను అబ్బా ఎంతసేపు ఇలా నిలబడాలి అనుకున్నాడో ఏమో.. మరోసారి బస్ అంతా పరిశీలించి చూశాడు… ఎక్కడా సీటు ఖాళీ అవలేదు. పైకి చూశాడు. అక్కడ లగేజ్ పెట్టే ర్యాక్ మీద అతని దృష్టి పడింది. వెంటనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది..క్షణం ఆలోచించకుండా దానిపైకి ఎక్కి తాపీగా పడుకున్నాడు. రైల్లో లగేజీ ర్యాక్పై పడుకుని ప్రయాణం చేసినట్టుగా బస్సులో పడుకుని ప్రయాణం చేయడం చూసి అంతా నవ్వుకున్నారు. ఇది బస్సు అనుకున్నావా.. రైలు అనుకున్నావా అంటూ అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 3 లక్షలమందికి పైగా వీక్షించారు. 10వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్టు తెలుస్తోంది.
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..
ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు 'గ్యాస్ ఫీజు' కట్టాల్సిందే..
అమ్మ దొంగ చేపా... ఎంత పనిచేశావే !
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

