AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల కొంప.. గృహ ప్రవేశానికి ముందే కూల్చివేత

గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల కొంప.. గృహ ప్రవేశానికి ముందే కూల్చివేత

Phani CH
|

Updated on: Oct 01, 2025 | 1:54 PM

Share

బెంగళూరులో మరో భవనం కూలిపోవడానికి సిద్ధమైంది. కోరమంగల జక్కసంద్రలో ప్లాన్‌ను ఉల్లంఘించి అతి తక్కువ స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల బిల్డింగ్‌ వాలిపోయింది. మూడు అంతస్తులకు అనుమతి తీసుకుని ఐదు అంతస్తులు నిర్మించారు. శాంతమ్మ అనే మహిళ ఏడాది క్రితం 3 అంతస్తుల కట్టడానికి నగర పాలిక నుంచి అనుమతి తీసుకుంది.

కానీ 15 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు స్థలంలో 5 అంతస్తుల కట్టడాన్ని నిర్మించింది. దీనికి రూ. కోటి వరకూ ఖర్చు చేసింది. వచ్చేవారం గృహప్రవేశం చేయాలని సిద్ధమయ్యారు. అంతలోనే భవనం పిల్లర్లు, గోడల్లో తీవ్రంగా పగుళ్లు వచ్చి ఓ వైపుకు వాలింది. ఎప్పుడైనా కూలుతుందని స్థానికులు భయపడ్డారు. దక్షిణ నగర పాలిక అధికారులు పరిశీలించి కూల్చివేయాలని తీర్మానించారు. 2 రోజుల నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ ఖర్చును భవన యజమానే భరించాలని తెలిపారు. ఆ పని పూర్తయ్యేవరకు చుట్టుపక్కల ఇళ్లవారిని ఖాళీ చేయించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pakistan: ట్రంప్ ను బుట్టలో వేసుకుంటున్న పాక్

గిన్నిస్ బుక్ లో తెలంగాణ బతుకమ్మ ఖ్యాతి

క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన CM రేవంత్

Gold Price: నేను తగ్గను కాక తగ్గను అంటున్న బంగారం

దసరా ఉత్సవాల్లో ‘పుత్తడి అమ్మ’ ఆల్ టైమ్ రికార్డులు