Student Thrashed: పాదాలను తాకలేదన్న కోపంతో విద్యార్థిని చావబాదిన టీచర్.!
పాదాలను తాకలేదన్న కోపంతో ఆరో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు చావబాదిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగింది, అంతటితో ఆగకుండా ఆ టీచర్.. కులం పేరుతో దూషించాడనీ బాధితుడి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశారు. గత నెల 27న చోటుచేసుకున్న ఈ ఘటన బాధిత విద్యార్థి తండ్రి అకల్జీత్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఆ మాస్టారు కొట్టడంతో తన కుమారుడు మనీశ్కు కంటి భాగంలో తీవ్రమైన గాయమైందని,
పాదాలను తాకలేదన్న కోపంతో ఆరో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు చావబాదిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగింది, అంతటితో ఆగకుండా ఆ టీచర్.. కులం పేరుతో దూషించాడనీ బాధితుడి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశారు. గత నెల 27న చోటుచేసుకున్న ఈ ఘటన బాధిత విద్యార్థి తండ్రి అకల్జీత్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఆ మాస్టారు కొట్టడంతో తన కుమారుడు మనీశ్కు కంటి భాగంలో తీవ్రమైన గాయమైందని, వీపు భాగంలో దెబ్బలు తగిలాయని అకల్జీత్లో ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ఉర్వా పోలీస్స్టేషన్ పరిధిలోని మురార్పుర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిశంకర్ పాండేపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
గత నెల 27న పాఠశాలలో తన పాదాలను తాకాల్సిందిగా మనీశ్ను పాండే కోరాడని, అందుకు మనీశ్ నిరాకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతోపాటు కులం పేరుతో దూషించాడని వివరించారు. గాయాలతో విలవిల్లాడుతూ మనీశ్ ఏడుస్తుండగా.. పాఠశాల నుంచి బహిష్కరిస్తానని కూడా ఉపాధ్యాయుడు బెదిరించినట్లు తెలిపారు. అకల్జీత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ జితేంద్రకుమార్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

