Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandyala: పొద్దున్నే శివాలయానికి వెళ్లగా వింత శబ్దాలు.. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా..

Nandyala: పొద్దున్నే శివాలయానికి వెళ్లగా వింత శబ్దాలు.. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూడగా..

J Y Nagi Reddy

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 21, 2025 | 12:41 PM

పొద్దున్నే శివయ్యను దర్శించుకుందామని శివాలయానికి వెళ్లిన భక్తులు కంగుతిన్నారు. ఎందుకుంటే అక్కడ ప్రమాదకర రక్తపింజర పాము కనిపించింది. దీంతో భక్తులు పరుగులు తీశారు. ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వెంటనే స్నేక్ క్యాచర్‌ను అక్కడికి పిలిపించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

శివరాత్రి సమీపిస్తున్న వేళ నంద్యాల శివాలయంలో పాము హల్‌చల్‌ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో గల శ్రీరామ థియోటర్ సమీపంలోని శివాలయంలో నాగజాతికి చెందిన రక్తపింజరి పాము జనాల్ని పరుగులు పెట్టించింది. రక్తపింజరి పాము ఆలయ పరిసరాల్లో గుర్తించిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తం అయిన ఆలయ నిర్వహకులు మహానందికి చెంది స్నేక్ స్నాచర్ మోహన్‌కు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న స్నేక్ స్నాచర్ మోహన్ రక్తపింజరి పామును పట్టుకోడానికి సుమారు గంటసేపు శ్రమించాడు. అనంతరం దేవాలయంలోని ఓ మూలకు పామును గుర్తించిన స్నేక్ స్నాచర్ చాకచక్యంగా రక్తపింజరి పామును ఓ సంచిలో బంధించాడు. బంధించిన పామును నల్లమల అడవిలో వదిలి వెయ్యడంతో అందరు ఊపిరి పిల్చుకున్నారు. నాగ సంతతిలో అరుదైన రక్తపింజరి పాము నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని ఓ శివాలయంలో కనపడటం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.   

 

Published on: Feb 21, 2025 12:39 PM