AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకుంటున్నారు.. ఎర్రబెల్లి కామెంట్స్ వైరల్

ఏపీపై మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజంట్ అక్కడ కరెంట్ లేక.. తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అప్పుడు సీఎంలు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను ఎద్దేవా చేశారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరూ గమనించాలన్నారు. తెలంగాణలో భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.

Ram Naramaneni
|

Updated on: Sep 07, 2023 | 11:32 AM

Share

రాష్ట్రం విడిపోయి చాలాకాలం అయినా తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య అప్పడప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తెలంగాణ డెవలప్‌మెంట్‌ను ప్రశంసించే సమయంలో కొందరు టీఆర్‌ఎస్ మంత్రులు.. ఏపీ నాయకుల్ని విమర్శిస్తూ ఉన్నారు. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. ఆంధ్రాలో కరెంటు లేక.. తీగలపై బట్టలు ఆరేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలో భూముల రేట్లు ఓ రేంజ్‌లో పెరిగితే.. ఏపీలో మాత్రం పడిపోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో ఎకరాల కొద్ది ల్యాండ్ దొరుకుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ప్రజంట్ ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us