Watch Video: ప్రధాని మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి? బండి సంజయ్పై వినోద్ ఫైర్
కరీంనగర్ అవసరాలు గురించి ఒక్కటంటే ఒక్కటి ప్రధాని మోదీ ముందు ప్రస్తావించలేని స్థానిక ఎంపీ బండి సంజయ్కి రానున్న ఎన్నికల్లో ప్రజలెందుకు ఓటేయాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ దగ్గర నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించి బీజేపీ ఎంపీ పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు.
కరీంనగర్ అవసరాలు గురించి ఒక్కటంటే ఒక్కటి ప్రధాని మోదీ ముందు ప్రస్తావించలేని స్థానిక ఎంపీ బండి సంజయ్కి రానున్న ఎన్నికల్లో ప్రజలెందుకు ఓటేయాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ దగ్గర నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించి బీజేపీ ఎంపీ పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు. స్వయంగా ప్రధాని మన దగ్గరకు వచ్చినా.. ఆయన్ను ఏమీ అడగలేని ఎంపీ మనకు ఎందుకన్నారు. మోదీ సభలో 15 నిమిషాలు మాట్లాడిన బండి సంజయ్.. ఒక్క నిమిషం కూడా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడలేదన్నారు. ఏం మాట్లాడినా వింటారని ప్రజలను తేలిగ్గా తీసుకుంటున్నారని వినోద్కుమార్ ఫైరయ్యారు. వేములవాడ సభలో మోదీ ప్రసంగాన్ని చూస్తుంటే ఆయన ఫ్రస్టేషన్లో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

