Watch Video: ప్రధాని మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి? బండి సంజయ్పై వినోద్ ఫైర్
కరీంనగర్ అవసరాలు గురించి ఒక్కటంటే ఒక్కటి ప్రధాని మోదీ ముందు ప్రస్తావించలేని స్థానిక ఎంపీ బండి సంజయ్కి రానున్న ఎన్నికల్లో ప్రజలెందుకు ఓటేయాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ దగ్గర నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించి బీజేపీ ఎంపీ పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు.
కరీంనగర్ అవసరాలు గురించి ఒక్కటంటే ఒక్కటి ప్రధాని మోదీ ముందు ప్రస్తావించలేని స్థానిక ఎంపీ బండి సంజయ్కి రానున్న ఎన్నికల్లో ప్రజలెందుకు ఓటేయాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ దగ్గర నియోజకవర్గ ప్రజల బాగోగుల గురించి బీజేపీ ఎంపీ పల్లెత్తు మాట మాట్లాడలేదన్నారు. స్వయంగా ప్రధాని మన దగ్గరకు వచ్చినా.. ఆయన్ను ఏమీ అడగలేని ఎంపీ మనకు ఎందుకన్నారు. మోదీ సభలో 15 నిమిషాలు మాట్లాడిన బండి సంజయ్.. ఒక్క నిమిషం కూడా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడలేదన్నారు. ఏం మాట్లాడినా వింటారని ప్రజలను తేలిగ్గా తీసుకుంటున్నారని వినోద్కుమార్ ఫైరయ్యారు. వేములవాడ సభలో మోదీ ప్రసంగాన్ని చూస్తుంటే ఆయన ఫ్రస్టేషన్లో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

