AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..

PM Modi: సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..

Srikar T
| Edited By: Ravi Kiran|

Updated on: May 13, 2024 | 1:58 PM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన లంగర్‌ సేవలో పాల్గొన్నారు. సిక్కు భక్తులకు స్వయంగా తన చేతులతో భోజనం వడ్డించారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో ప్రధాని మోదీ సేవకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టీల్ బకెట్ పట్టుకుని పంక్తిలో కూర్చున్న సిక్కులకు ఆహారం వడ్డించారు. మోదీ సేవా హృదయాన్ని చూసి అక్కడి సిక్కులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన లంగర్‌ సేవలో పాల్గొన్నారు. సిక్కు భక్తులకు స్వయంగా తన చేతులతో భోజనం వడ్డించారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో ప్రధాని మోదీ సేవకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్టీల్ బకెట్ పట్టుకుని పంక్తిలో కూర్చున్న సిక్కులకు ఆహారం వడ్డించారు. మోదీ సేవా హృదయాన్ని చూసి అక్కడి సిక్కులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే బీహార్‌ పాట్నాలోని ప్రసిద్ధ గురుద్వారాకు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాటు చేశారు అధికారులు. ఆదివారం పాట్నాలో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించారు. మే 13న బిహార్‎లోని జరిగే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హాజీపూర్, ముజఫర్‌పూర్, సరన్ నియోజకవర్గాల్లో ప్రసంగించారు. బీహార్‌లో రోడ్‌షో నిర్వహించిన తొలి ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. తదనంతరం ఈ లంగర్ సేవలో పాల్గొన్నారు మోదీ.

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: May 13, 2024 11:31 AM