AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి వచ్చి..

Watch Video: మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి వచ్చి..

Srikar T
|

Updated on: May 13, 2024 | 10:53 AM

Share

మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు. ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పవన్ ఓటు వేశారు.

మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు. ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పవన్ ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ ఈ పోలింగ్ సెంటర్‎కు వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఒకానొక సందర్భంలో పోలింగ్ బూతులోకి దూసుకొని వచ్చారు కొందరు వీరాభిమానులు. అయితే పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Published on: May 13, 2024 09:46 AM