Watch Video: కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలన్న కాంగ్రెస్.. అసలు కారణం ఇదే..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు కేసు నమోదు చేయాలని కోరింది. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సికింద్రాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు కేసు నమోదు చేయాలని కోరింది. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సికింద్రాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ దీక్ష మోడల్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆ తరువాత పోలింగ్ కేంద్ర బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించాల్సిందిగా కోరారు.
ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ భారత లోక్ సభ ఎన్నికలు అన్నారు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నికోవడానికి ఓటు కీలకం అని ప్రస్తావించారు. అవినీతి.. కుటంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి ఓటు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇలా మాట్లాడే క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న ఈసీకి తెలిపింది. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయలని కాంగ్రెస్ ఈసీని కోరింది. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తారన్నది ఉత్కంట నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

