PM Modi: ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం.. త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో, త్రివిధ దళాల నాయకులు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధానమంత్రికి వివరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత విచ్ఛిన్నమైన పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తోంది. ఆ వివరాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటికి త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్రివిధ దళాల నాయకులు ఆపరేషన్ సింధూర్, భారత సరిహద్దుల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని మోదీకి వివరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్.. భారత సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడులను మూడు భారత సాయుధ దళాల సైనికులు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. పలు సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించింది కేంద్రం. మొత్తం పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశ సరిహద్దు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీ నిశితంగా గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

వాడి కన్ను గుడి మీద పడిందా ?? ఇక నగలన్నీ కనుమరుగే..

పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్

అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని

పెళ్లి అనుకుంటున్నారా.. స్టంట్స్ షో అనుకుంటున్నారా..

నెల్లూరు జిల్లాలో అద్భుతం - శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము

ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్ తయారీ

యజమానిపై ప్రేమతో.. ఏనుగులు ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో

పులిని మింగబోయిన అనకొండ... ఆఖరికి అంతా షాక్ వీడియో

వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..

350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత

క్రేజీ ప్రాజెక్ట్లో ఎన్టీఆర్.. ఆ దార్శనికుడి బయోపిక్లో వీడియో

పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
