PM Modi: ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం.. త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో, త్రివిధ దళాల నాయకులు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధానమంత్రికి వివరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత విచ్ఛిన్నమైన పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తోంది. ఆ వివరాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. ఈ భేటికి త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్రివిధ దళాల నాయకులు ఆపరేషన్ సింధూర్, భారత సరిహద్దుల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని మోదీకి వివరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్.. భారత సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడులను మూడు భారత సాయుధ దళాల సైనికులు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. దేశ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. పలు సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించింది కేంద్రం. మొత్తం పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశ సరిహద్దు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీ నిశితంగా గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అయ్యో.. ఈ శునకం కష్టాలు చూసి చలించిపోయిన భక్తులు
చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్..
అమ్మంటే అమ్మే.. తన బిడ్డ కోసం ఉడుతమ్మ సాహసానికి నెటిజన్లు ఫిదా
భర్త ఎదుటే ఉరివేసుకున్న భార్య.. కాపాడాల్సింది పోయి..
ఇడ్లీ తింటే .. జీఎస్టీతో పాటు 'గ్యాస్ ఫీజు' కట్టాల్సిందే..
అమ్మ దొంగ చేపా... ఎంత పనిచేశావే !
గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

